పుట:SaakshiPartIII.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. సుఖము, దుఃఖము

ప్రపంచంలో సుఖదుఃఖాల తీరు ఎటువంటివో విచారణ చేయడంకోసం వివరంగా చేసిన ప్రసంగం ఇది.

ప్రపంచంలో వేదాంతులంటూ ఎంతమంది వుంటారు? ఒక్క చేతి మీద లెక్కపెట్టినా అయిదువేళ్లూ పూర్తికావు. మిగిలిన వాళ్లంతా మొండితనంతో బతకవలసిందేనా?

హరిశ్చంద్రుడు, రామచంద్రుడు, పడిన కష్టాలకు లెక్కవుందా?అయితే పట్టాభిషిక్తు లయ్యారుకదా! అంటే, వారుపడిన మనోవేదన ముందు ఈసుఖం ఏపాటుది? బతికినన్నాళ్లూ పధ్నాలుగు బతుకులకు సరిపోయే ఏడుపుఏడిచి ప్రాణంపోయేవేళకి భగవత్కటాక్షం కలిగి బాగుపడ్డామని చెప్పిన మహాపురుషులంతా పెరిగిన వెలుగుమాత్రం ఏమంత దొడ్డది?

సుఖపడాలంటే, మొండివాడైనా కావాలి. వేదాంతి అయినాకావాలి. ప్రపంచంలో సుఖం సంపాదించే ధనం, సంసారం, వస్తుసామగ్రి లేకపోతే ఎంతకష్టమో మరీ ఎక్కువుంటే కూడా కష్టమే. సదానందయోగి చెప్పిన ఒకతత్త్వాన్ని బట్టి చూస్తే ప్రకృతిస్థితి, మధ్యమార్గంలో నడుస్తున్నంతసేపే మనిషికి సుఖం. బాహ్యప్రకృతికంటె ఆశ్చర్యకరమైన ఆంతరప్రకృతిలో సైతం-కష్టసుఖాలకు సంబంధించినంత వరకూ-బాహ్యప్రకృతి సూత్రాలేవర్తిస్తాయి. సుఖం, బాధ అనేవి ప్రకృతిస్థితులుగాని, స్వతంత్ర తత్త్వాలుకావు. ఒక ప్రకృతి సన్నివేశానికి ఈచివరకష్టం. ఆచివరకష్టం. నడుమ సుఖం. ఈ తత్త్వాన్ని వివరించడానికి ఒక పేద బ్రాహ్మడికథ చెప్పాడు. హఠాత్తుగా 'లాటరీలో డబ్బురావడంతోపాటు, పెరిగిన దుఃఖతత్త్వం ఇందులోసారం.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

అంతకుఁబూర్వ మేమిచెప్పెనో కాని నేను వెళ్లిన పిమ్మట నిట్టు చెప్పెను.

జాలిగుండెవాఁడు జను లేమియందురొ
యనుచు భీతిఁజెందు నట్టివాఁడు
బిడియమునకు గొంకి వెనుకాడువాడును
ధరణిలోన నెపుడు దక్కలేరు