పుట:SaakshiPartIII.djvu/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెచ్చించునో గ్రహించుటయందుఁ గొంత పొరపాటు పడియుండెనని నాకు దోఁచినది.

నాయనలారా! కొంచెము శ్రద్దతో వినుడు. ఈ సందర్భము నందలి నామాటలు మీ మనస్సుల కెక్కవేమో యని యనంగా నెక్కునంత స్పష్టముగ నేను జెప్పలేనేమో యని భయపడుచున్నాను.

మనమందఱము సుఖములు పడుచున్నాము. కష్టములు పడుచున్నాము. సుఖములు శాశ్వతములు కావు. కష్టములు శాశ్వతములు కావు. కష్టసుఖములు రెండునుగూడ మనమన స్సులందు స్థిరములైన సంస్కారములను గలుగఁజేయు చున్నవి, మనము స్వభావసిద్దముగా వెనుకబడిన సుఖములను గష్టములను గూడ స్మరించెదము. మన మనః పటములంధుఁ గష్టసుఖములను భగవంతుడు చిత్రించినాఁడు. ఆపటము యొక్క యనుకరణమే భవభూతి పటము....సుఖసంస్మరణములు.

పశ్చాత్తాప సహితములు కాకున్నయెడల సుఖమునే యొసంగును. కష్టసంస్మరణ ములు మాత్ర మొకప్పడు సుఖము నిచ్చును, ఒకప్పడు కష్టము నిచ్చును. అది యెప్పడు? ఇది యెప్పడు? మనమెన్ని కష్టముల బడిన సరియేకాని యొక్క ప్రాణమైన పోకుండ నందఱము బాగుగానుండి కష్టములు దరించుట సిద్దించినయెడల నీకష్టములస్మృతి యందు విచారమెంతమాత్రము కూడ గలుగదు. అంతేకాక యుత్సాహము కూడా గలుగును. కష్టము గడచిపోయిన కొలఁది కాలమునకైన మన మందఆము కలిసి యాకష్టములగూర్చి ముచ్చ టంచుకొనుట మిగుల నానందదాయకమగును. ఎక్కట కష్టములు పడితిమో యాస్టలము చూచునప్పడు పూర్వకష్టములలో మనము కనఁబఆచిన ధైర్యము భక్తి సాహసము నుగ్గడిం చుకొని యుత్సాహ మందుదుము. వెనుకటి కష్టము లలో మనము బేలగుండెతో నేడ్చినను వానిని స్మరించు కొనునప్పడు మాత్రము కష్టములు మన ప్రయోజకత్వము చేతనే కడతేeజీన వని రవంత వెల్లడించుటకై కొన్ని రజ్జలు కొట్టుటకూడ సామాన్యమనుజ స్వభావమైయు న్నది. పూర్వాను భూతము లగు నెంతభయంకర దుఃఖకరసన్నివేశములు స్మరించుకొనిన ప్పడైనను గాసంతయదటు తెప్పపాటు కాలములో దళుక్కుమని కొన్ని యత్యంతభీరు ప్రకృతులందుఁ గలుగునుగాని వెంటనే యాభయము దుఃఖము నడఁగిపోవును. అంతేగాని వడఁకుటవలకుఁ గాని యేడ్చుటవఱకుఁగాని యెన్నడు రాదు. మన మందఱము బాగుగా నుండి కష్టముల దరించినప్పడే స్మృతి కాలమున నీనిర్విచారస్థితి.

అందుచేత సీత భార్గవునిఁ జూచి వడఁకిన దని చెప్పట స్వభావ దూరము. అప్డే పటదర్శనమున సీతా శోకము, రాముని దుఃఖము, లక్మణుని మనఃపరితాపము సహజములు కావని నామనవి.

కాని పటము దుఃఖమును గలుగఁజేయు సన్నివేశమేదనంగా: మనకత్యంత ప్రేమాస్ప దులగువా రెవ్వరైనా మృతులైయుండ వారి విగ్రహదర్శనము మనకు సంతాపము కలిగిం చుము. ఇది కూడ కాలక్రమమునఁ దగ్గును. సీతాకళ్యాణమైన తరువాత నయోధ్యప్రవేశించు సందర్భమున లక్మణుడు పటమునఁ బఠించుచున్నాడు.

లక్మ:- ఇదిగో మన మయోధ్య ప్రశేశించితిమి.

రాము:- (కన్నీరు విడుచుచు) తలఁపునకు వచ్చినది. అక్కటా! తలంపునకు వచ్చినది.