Jump to content

పుట:Rukmini Kalyanam 1937-Song Booklet.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాటెను. 4 కోమార్తె సౌఖ్యములు కోరెడు తల్లిదండ్రులు అంత గంగిక మిత్రురాలగు సునందను పిలిచి కొమార్తె మనస్సు ఎవరి మీద కలిగియున్నదో కనుగొనమన్నారు. జరాసంధుడు ఏర్పాటు చేసిన రాజసభకు అనేక రాజులు వచ్చిరి. రాజసమూహములయెదుట జరాసంధుడు కృష్ణుని గురించి దుర్వి నీతుడనియు మహాపాపియనియు దండనార్హుడనియు అని అనేక విధముల యుపన్యసించి తర్వాత రుక్మిణిని శిశుపాలునికిచ్చి వివాహము చేయవలసినదిగా రుక్మికి జరాసంధుడు ఎక్కువ ప్రోత్సహించెను. అంతట రుక్మి ఆ అభిప్రాయముతో నీ గృహమునకు వెళ్లెను. నారదునిచే రుక్మిణీనిగురించి విని కృష్ణుడు రుక్మిణిపై ప్రేమ కలిగియుండెను. రుక్మిణి కృష్ణుని పటములు అతని స్మరణితప్ప మరియే పటములు వై పుచూడదు. ఈ విషయము సునంద రుక్మిణిని తలిదండ్రు లకు తెలిపెను. అంతట వారు మిక్కిలి సంతోషించి రుక్మిణి కృష్ణుని కిచ్చి వివాహము చేయుటకు అభిలాష కల్గియుండిరి. అప్పుడు రుక్మి ణికి ఎక్కువ ఆనందం అయితే విఘ్నము కలిగినది. మగధనుండి తిరిగి నచ్చిన రుక్మి ఆ విషయము వినినతోడనే ఎక్కువ కోపము కలిగిన వాడై రుక్మిణిని ప్రియబంధునగు శిశుపాలునికిచ్చి వివాహము చేయ వలసినది అని పట్టుపట్టెను. అంతట రుక్మిణికి ఆశాభంగమై దుఃఖముతో బాధపడుచుండగా సునంద ధైర్యము చెప్పినది. కృష్ణుని రాక్షసవిధిని వివాహము చేసుకో మనుటయు ఆ విషయము కృష్ణునికి తెలుపుటకును అగ్నిద్యోతనుడను బ్రాహ్మణుని తోడ్కొనివచ్చినది. అతనిద్వారా కృష్ణునికి కబురు పంపినది రు రుక్మిణి స్వయంవరమునాటికి సమస్త రాజులు కుండిన నగర మునకు వచ్చిరి. పెండ్లి ప్రయత్నములు జరుగుచున్నవి. బ్రాహ్మ