ఈ పుట ఆమోదించబడ్డది
38
తరతరంబులనుండి యీ కథ
తరలి వచ్చినదేకదా మఱి
విరళముగ నొక మట్టి ముద్దను
చఱచి మర్దించి
పరగ మానవ దేహమనుచును
గరమునను గొని యొక్క కుమ్మరి
యరుదుగా నిర్మించె దీనిని
ఇష్టమగునట్లు.
39
ఎన్నియో మధురసము బొట్టులు
చిన్న చిన్నవి పడును భూమిని
క్రన్న నవి యిఱ్ఱింకు లింకుచు
పోయి పోవుచును,
ఎన్నడో యది యెంతక్రిందనొ
మన్నుగాఁ బడియున్న కన్నుల
నున్న పరితాపాగ్ని నార్పఁగఁ
దోడుపడునె కదా.
20