చతుర్థాంకము.
61
రంగము-3.
స్థలము: రమేశ మందిరము.
[విశ్రాంతి నందియున్న అన్నపూర్ణయు, రమేశబాబు, మోహనరావు ప్రవేశము.]
రమే - బాబూ! నీపేరేమి?
మోహ - మోహనరావు,
రమే - నీతండ్రిపేరు జ్ఞాపక మున్నదా బాబూ ?
మోహ - శంకరరావుగారు.
రమే - శంకరరావుగారా ! (తల పంకించి) సరియే! నాయనా! మీరిదివర కేయూరిలో నుండువారు ?
మోహ - కాకినాడలో.
రమే - ఇక్కడికి వచ్చి యెన్నాళ్లయినది?
మోహ - ఏమో ! కొన్నా ళ్ళయినది.
రమే - సరే, పోనిమ్ము. ఆయమ్మ నీతల్లియేనా ?
మోహ - ఔను.
రమే - పేరేమి?
మోహ - అటువంటిమాట మీ రడుగవచ్చునా
రమే — (చిరునవ్వు నవ్వి) నీబుద్ధికి సంతసించితినిగాని నాయనా! నేను నీకు తాతయ్య నగుదును. తప్పులేదులే. చెప్పుము.
మోహ - అన్నపూర్ణమ్మగారు.
రమే -(ఒక పాత్రను దెచ్చి) దీనిని నీ కెవ్వ రిచ్చినారు !
మోహ - ఒకపెద్దమనుష్యుఁడు. “మీఅమ్మ మూర్ఛపోయినది - మంచి నీళ్ళు తె"మ్మని నా కిచ్చినాఁడు.
రమే - ఆపెద్దమనుష్యుఁడు నీతండ్రిగారివలెనున్నాఁడేమో చూచితివా ?