పుట:Ranganatha Ramayanamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శ్రీరంగనాథరామాయణము

ద్విపద

నంత నాభృగుఁడును నాతపంబునకు - సంతుష్టహృదయుఁడై సగరు నీక్షించి,
"పృథివీశ కొడుకులు పెక్కండ్రు నీకుఁ - బ్రథితోరుకీర్తులు పరఁగఁ బుట్టెదరు
అంచితకీర్తిని నతివలం దొకతె - గాంచు నొక్కని వంశకరుఁ డైనపుత్రు
మఱియొక్కసతి గాంచు మానుగా సుతుల - నఱువదివేవుర నతులవిక్రముల”
నని వరం బిచ్చిన నారాజసతులు - విని కరంబులు మోడ్చి వినయంబుతోడ
మునినాథునకు మ్రొక్కి “ముద మంద నొక్క - తనయుఁ డేసతి కన్నతనయు లేసతికి?”
ననవుడు “మీకోరినట్లయె పుత్ర - జననంబు" లని పల్క సంతోష మంది,
యం దగ్రమహిషి నిజాన్వయరుచిక - నందను నొక్కని నరనాథుఁ గోరె. 1120
మఱి కోరె నాయున్నమగువయు సుతుల - నఱువదివేవుర నధికమోదమున
సగరుండు భృగునకు సతులతోఁగూడ - నొగిఁ బ్రదక్షిణమంత నొనరించి ప్రీతిఁ
బురమున కేతెంచి పొలుపారనంతఁ - గరము వేడుకఁ గొంతకాలంబు చనఁగ
మానుగాఁ దనయగ్రమహిషి కేశినియు - సూనుని నసమంజసుం డనువానిఁ
గనియె; నాసుకృతియుఁ గాంతకుఁ బుట్టి - ఘనతరంబైనట్టి గర్భతుంబంబు
కఱుకైన యాసొరకాయలోఁ బుట్టి - రఱువదివేవు రత్యద్భుతలీల;
నంత దాదులు వారి నాజ్యభాండములఁ - గొంతకాలము బెంపఁ గొమరారి వారు
రూపయౌవనముల రూఢమైఁ బెరిగి - రాపెద్దవాఁ డందు నతులదర్పమున
వాపోవఁ దమ్ముల వడిఁ జుట్టి పట్టి - చాపలంబునఁ గట్టి సరయువులోన
వైచిన నవ్వుచు వచ్చిన మగుడఁ - ద్రోచుచునుండు నాదుష్టాత్ముఁడైన1130
యసమంజసున కంత నంశుమంతుండు - దెసలఁ దేజంబులు దీపెంపఁ బుట్టె.
నాయసమంజసుం డతిదుష్టచిత్తుఁ - డైయున్న నతనిఁ బోనడఁచి యారాజు

శ్రీరాముఁడు సగరులవృత్తాంతముఁ దెల్పు మనుట

శాశ్వతధర్మనిష్ఠాపరుం డగుచు - నశ్వమేధము సేయ ననురక్తిఁ దొడఁగె.”
ననినఁ గౌశికుఁ జూచి యారాముఁ డనియె "మునినాథ! మావంశములవారికథలు
విన వేడ్క పుట్టెడు వివరించి చెప్పు" - మనిన విశ్వామిత్రుఁ డనియె రామునకు
“విడువక హిమశైలవింధ్యశైలముల - నడుమ నాసగరుజన్నంబు వర్తించి
యాగంబుచేరువ నంశుమంతుండు - రాగిల్లి యశ్వంబు రక్షించునెడను,
ననిమిషపతి దైత్యుఁడై ముచ్చిలించి - కొనిపోయి పాతాళకుహరంబు సొచ్చి
కపిలసంయమిచెంతఁ గడఁకతోఁ గట్టి - యపరిమితానందుఁడై పోయె దివికి
భూపాలుఁ డశ్వంబు పొడగాన కిచ్చఁ - గోపించి మండుచుఁ గొడుకులఁ జూచి1140
"యిట కాన మశ్వంబు నెవ్వఁడో వచ్చి - కుటిలుఁడై ముచ్చికొనిపోయినాఁడు.
మూఁడులోకంబులు మును మిడి వెదకి - వాఁ డెవ్వఁడైనను వాని నిర్జించి