పుట:Ranganatha Ramayanamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావ్యము

బాలకాండము

15



నలువురు కొడుకులు నరనాథ నీకుఁ - గలిగెద"రని పల్కఁ గడు సంతసిల్లి
సవనయోగ్యంబైన జవనాశ్వ మరసి - భువనపావనమూర్తి పూజించి నొసఁట
బ్రకటితబిరుదాంకపట్టిక గట్టి - యొకయేఁడు దనయిచ్చ నుర్విఁ జరింప
సమకట్టి విడిచె నశ్వంబు రక్షింప - విమతోగ్రులగు సైన్యవిధులతోఁగూడ.
నంత వసిష్ఠాదు లనుమతి సేయ - వింతఁగా శిల్పకోవిదుల రావించి,
సరయువు నుత్తరస్థలి యాగశాల - విరచింపఁగాఁ బంచె వేదోక్తసరణి. 420
మఱియు నానాదేశమనుజవల్లభుల - వఱలు విప్రనృపాలవైశ్యశూద్రులను
రప్పించె; నంత వర్షము పూర్ణమైన - నెప్పటిమధుమాస మేతేర నృపుఁడు
చిరతపోనిధి ఋశ్యశృంగుసమ్మతియు - గురునియానతియుఁ గైకొని మంచివేళ
స్పృహను శాంతాఋశ్యశృంగులతోడ - నిహితసంభారవర్ణితహోమకుండ
సహితమై యేకవింశతిరమ్యయూప - మహితమై శ్రౌతధర్మక్రియాచార
విహితమై మాయాప్రవీణదైతేయ - రహితమై సకలాఘరహితమై యొప్పు

దశరథుఁడు యాగదీక్ష వహించుట

యాగవాటము చొచ్చి, హయము వచ్చుటయు - యాగదీక్ష వహించి యతిశుద్ధిఁ బొంది
మునుల వసిష్ఠాదిమునిజనోత్తముల - ఘనుల ఋత్విక్కులగా వరియింప
సవనత్రయం బభీష్టమున నొనర్చి - ప్రవిమలయూపాగ్రబద్ధంబులైన
జలచరంబు లరణ్యచరములు విహగ - ములు నురగంబులు మొదలుగా నొప్పు 430
పశువుల మున్నూటిఁ బ్రథితాశ్వమొకటి - విశసించి క్రతుకర్మవేదులు ప్రీతి
నేమంత్రములతోడ నేపలలములు - గామించి వేలుపఁగా జెప్పుశ్రుతులు,
నామంత్రములతోడ నాపలలములు - కామించి వేల్చిరి కడఁగి ఋత్విజులు.
అనలుండు సప్తజిహ్వలఁ బ్రజ్వరిల్లె; - ననిమిషుల్ దనిసి రాహవిరాదికముల;
నాయాగదినముల నాఁకొన్నవాఁడు - నాయాసపడినవాఁ డరసిన లేఁడు.
సారమృష్టాన్నవస్త్రపటీరకనక - హీరభూషాదిసంతృప్తులే కాని
యేక్రియలందును నెడపడకుండ - నీక్రియ హయమేధ మీడేరుటయును,
వెనుక జ్యోతిష్టోమవిశ్వజిదాది - ఘనయాగతతులు సాంగము మీఱఁ జేసి,
యధ్వరదక్షిణకై పూర్వదేశ, - మధ్వర్యునకును బ్రహ్మకు దక్షిణంబు, 440
పొనరంగఁ బశ్చిమభూమి హోతకును, - దనర నుత్తరము నుద్గాతకు నిచ్చె.
నిల నయోధ్యయుఁ దక్క నెల్లదేశముల - నలరి యిచ్చిన ముదమంది ఋత్విజులు
“ఎప్పు డేలుదుము నీ విచ్చినదేశ? - మెప్పు డనుష్ఠాన మేము సల్పుదుము?
ఏ మేడ? దేశంబు లేలుట లేడ? - భూమికి వెల యిమ్ము భూమీశ! మాకు "
ననవుడుఁ బదికోటులగు సువర్ణములు - కనకంబు నలుమడికలధౌతచయముఁ