పుట:Ranganatha Ramayanamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

శ్రీరంగనాథరామాయణము

ద్విపద



వచ్చుచో దూతలవలను వీక్షించి - పుచ్చి ముందర వారిఁ “బురమును నగరు
వాసవుపురితోడ వైభవం బొప్పఁ - గైసేయవలయును గడువేగ మీరు".
అని పల్క వారును నరిగి పౌరులకు - వినిపింపఁజేసిరి: వివిధశిల్పముల
దుందుభిశంఖాదితుములనాదముల - నందంద మ్రోయించి; రంత భూపతియుఁ
బురమున కేతేరఁ బురజను ల్సేయు - పరమమంగళతతు ల్పరఁగఁ గైకొనుచు,
నతనువిరోధ్యసాధ్యకు నయోధ్యకును - జతురుఁడై తోడ్తెచ్చె శాంతతోగూడ;
నీరీతి నాఋశ్యశృంగుని దెచ్చి - భూరమణుం డంతిపురమున నునిచి
వితతార్ఘ్యపాద్యాదివిధులఁ బూజించి - యతికృతార్థుఁడ నైతి నని సంతసించె; 390
నాసమయంబున నారాజసతులు - కౌసల్యమొదలుగాఁ గలవారు వేడ్క
నలువొంద ఱేనియానతిఁ బూని చాల - నలరి సంతసమున నాశాంత కపుడు
మహితభూషణవస్త్రమాల్యాదు లిచ్చి - బహువిధంబుల వారిఁ బ్రార్థించి; రంతఁ.
గొంతకాలమునకుఁ గువలయజనులు - సంతోష మెసఁగ వసంత మేతేర.
నడరెడువేడుక నాఋశ్యశృంగు - కడకు భూపతి వచ్చి కడుభక్తి మ్రొక్కి,
“సన్నుతస్థితి నన్ను సంయమిప్రవర! - చెన్నొంద జన్నంబు సేయింపవలయు"
నని విన్నవించిన నౌఁగాక యనుచు - నినకులోత్తముఁ జూచి యిట్లని పలికె.
"వేగంబె తెప్పింపు విహితంబులైన - యాగసంభారంబు లన్నియు నధిప!"
యనవుడుఁ దగువారి నయ్యైతెఱంగు - లొనరింపుఁ డనుచు నియోగింపఁబనిచి,
యఖిలసంభారంబు లన్ని దెప్పించి - మఖము చూచుటకు సుమంతునిఁ బంపి 400
కేకయక్ష్మానాథుఁ గీర్తిసనాథు - నాకాశిరాజు నవ్యాహతతేజు
జనకాంగరాజాదిజననాథవరుల - ననఘచరిత్రుల నర్థి రప్పించి,
మనుజనాయకుఁడు సుమంతుతో ననియె - “ననఘుల వేదవేదాంగపారగుల
గృహమేథు లగువారి గృతతంత్రభావ్య - మహితార్థనిశ్చయమతుల భూసురుల
బరఁగు సుయజ్ఞు జాబాలిఁ గశ్యపుని - సురుచిరాత్ముని వసిష్ఠుని వామదేవు
రయమునఁ దోడ్కొనిరమ్ము నీ"వనినఁ - బ్రియమున నాతండు పెంపార నరిగి
యురుభక్తి నందఱ నొగిఁ దోడితేరఁ - బరువడిఁ దా నర్ఘ్యపాద్యాదు లిచ్చి,
నిర్మలవ్రతనిత్యనిష్ఠార్థమైన - ధర్మార్థయుతముగాఁ దగుమాటఁ బలికె.
"మునులార! కొడుకులు మును నాకు లేమి - మనమునఁ దలపోసి మమత రెట్టించి
మిత్రసూక్తుల నశ్వమేధయాగంబు - పుత్త్రులకొఱకునై పుత్త్రకామేష్టి 410
సేయంగ నీఋశ్యశృంగుఁ దోడ్తెచ్చి - మీయనుగ్రహము గామించి యున్నాఁడ."
ననవుడు నావసిష్ఠాదిసంయములు - జననాథుమాటకు సంతోష మంది
"యినకులోత్తమ! లోకహిత మాచరింపఁ - దనయులఁ గోరు నీతలఁ పొప్పు నింక
నశ్వంబు విడువు మీయశ్వమేధమున - విశ్వరక్షకులైన విక్రమోజ్జ్వలులు