పుట:Ranganatha Ramayanamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావ్యము

బాలకాండము

11

ఋశ్యశృంగవృత్తాంతము

"ధరణీశ! మీకు సంతానసంప్రాప్తి - వెరవైనకథ మున్ను విన్నాఁడ నేను;290
భూమీశ! విను మంగభూమీశుకొడుకు - రోమపాదుఁడు గుణారూఢుండు దొల్లి
యేమిపాపముననో యెఱుఁగఁజొప్పడక - యామహిలో వర్ష మటు కుర్వదయ్యె.
దా నేలి పాలించు ధరణిపై నెందు - వానలు లేకున్న వగలను జెంది,
వరమునీంద్రులచేత వర్షహోమములు - పరువడి సేయించి, పడయరాకున్న
భూరిశోకంబునఁ బొగలుచునున్న - యారాజుఁ గనుఁగొని యమ్మును లనిరి,
"యోమహీపాలక! యోరాజచంద్ర! - యీమహిపై వాన లిటఁ బర్వుటకును
నొకయుపాయమ్ము మే మొగిఁ జెప్పువార; - మకలంకమతితోడ ననువొందఁజేయు:
పరహితోన్నతుఁడు విభాండకసుతుఁడు - చిరపుణ్యనిధి ఋశ్యశృంగుఁ డన్వాఁడు
నగధైర్య! పట్టిననాఁటనుండియును - నగరరాష్ట్రంబు లెన్నఁడు నెఱుంగమిని
నతఁ డెందు నాఁడువా రనుపేరు నెఱుఁగ; - డతఁడు తాపసవృత్తి నడవుల నుండు;300
వసుధేశ! యతఁ డిందు వచ్చినఁ జాలు; - వెసఁబాయు నీయనావృష్టిదోషంబు."
నావుడు మునినాథు నగరి కేరీతి - రావింతు నని విచారము చేసి తెలిసి
అతఁడు వచ్చుటకును నాత్మఁ జింతించి - మతిమంతు లగునట్టి మంత్రులఁ బిలిచి
మునులను రప్పించి ముద మొప్ప నడుగ - మునులును మంత్రులు ముదముతోఁ జెప్ప
మనమున సంతోషమహిమ శోభిల్ -, మునులమాటలు విని మోదంబు మీఱ
నుండెను భూకాంతుఁ; డొగి మౌను లనిరి - దండిగ నోరాజ! తలపోసి యిపుడు
వారకాంతలనెల్ల వసుధేశ! పంపు; - వారకాంతలచేత వనముల కిపుడు
దండిగా భక్ష్యముల్ దగవారి కిచ్చి - మెండుగ వనముల మేటివస్తువులు
పెట్టి పంపుము నీవు పెంపుతో ననుచు - గట్టిగాఁ గాంతలు కడుప్రౌఢసతులు
తిన్నగ నటుపోయి తెఱఁగొప్పఁ గాంచి - మన్ననచే మౌనిమహిమ వీక్షించి,310
తియ్యనిభక్ష్యముల్ తెఱఁగొప్ప నిచ్చి - నెయ్యంబుచే మది నెఱిఁ గరఁగించి,
యాటలఁ బాటలఁ దేటమాటలను - బాటలగంధులు పదిలులై నిలిచి
మనసెల్లఁ గరఁగించి, మఱి వెంట నంటి - మనసిజాకారలు మఱి మాయ పన్ని
యచ్చుగ నిటు రాగ, నతడు వెన్దగిలి - వచ్చును; నిందుకు వసుధేశ! వినుము."
అని చెప్పి మునివర్యు లట చని రంత - ఘనముగా నారాజు కరుణ నారాత్రి
మన మలరగ నుండి, మఱునాఁడు లేచి - మునులను దలఁచుచు ముద మొప్ప నంత
ననురక్తిఁ గడుఁబ్రోడ లగు వారసతుల - వినుతయౌవనరూపవిభ్రమవతుల
మనసిజుమోహనమంత్రదేవతలఁ - బనిచె నొప్పెడువారిఁ బాటించి యతఁడు.
అతివ లమ్మునియున్న యడవికిఁ బోయి - యతని యాశ్రమభూమి కల్లనఁ జేరి,