పుట:Rajayogasaramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45

తృతీయ ప్రకరణము

తెఱఁగార నట సుషుప్తిని జెంది యవల
సురుచిరమైన విష్ణుగ్రంధిఁ జొచ్చి
ఘనమహాకారణాంగంబు ధరించి
యనువుగ నచట తుర్యాఖ్య వహించి
మఱియు నందుండి బ్రహ్మగ్రంధిఁ జొచ్చి
సరవిఁ దుర్యాతీతసంజ్ఞ వహించి
క్రమముగ నాధారకమలంబు చేరి
అమర నచ్చట పరమానంద మేమొ
కరమర్థి క్షణముండి క్రమ్మరం దిరిగి
సరగున సామపంచకమును గూడి
మొనసి యాజ్ఞాచక్రమున నిల్చియుండు
వనజాఁప్తుఁ డుదయించి వచ్చినజనులు
మురసి తత్తత్కార్యములు సల్పుపగిది
నరయ భ్రూమధ్యమం దాత్మభాస్కరుడు
నిలిచి యుండినవేళ నిఖిలేంద్రియంబు
నలరారఁ దమపను లన్ని గావించి
యవల సుషుప్తియం దనుదినం బడఁగు
నవియెల్ల నీవు పాయక విను మమ్మ 50
అనువొంద నివియ నీవైనసుషుప్తి
నను నిత్య మొందకు నశ్వరం బగుచు
నీకు నాశము లేదు నిత్యం బటంచుఁ
బ్రాకటంబుగ శ్రుతు ల్పల్కుచు నుండు