పుట:Rajayogasaramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29

ద్వితీయ ప్రకరణము

జనయిత్రిఁ జూచి యాసత్కుమారుండు
మనమున హర్షించి మాత కిట్లనియె
వినవమ్మ జనని యీవిశ్వంబునందు
మనుజులు వేఱ కర్మంబులు విడచి
తను దాను దెలిసినధన్యునిఁ జేరి
పనివడి ద్వాదశాబ్దములు శుశ్రూషఁ
జేసి మెప్పింపఁగ శ్రీగురుమూర్తి
భాసురంబుగ వారిభక్తికి మెచ్చి
యసదృశసిద్ధాసనాసీనుఁ జేసి
భసితంబు తమఫాలభాగాల నుంచి
వారితత్పూర్వపువ్రాలెల్లఁ దీసి
భూరికృపవ్రాలు పొందుగ వ్రాసి
జడియకుఁ డని వారిజడుపెల్లఁ దీర్చి
కడువేడ్క రాజయోగప్రకారంబు
సాంగముగను జెప్పి సాధుపథంబు
శృంగాటకంబునఁ జేరి చూడుఁడని70
గురుమూర్తి యపుడు మక్కువ మీఱ శిష్యుఁ
డరుదుగఁ దసమానసాబ్జమం దుంచి
పరమార్థసరణి సద్భావంబు మీరఁ
బరమాద్భుతధ్యానపరవశత్వమున
మనసు సహస్రారమధ్యమం దుంచి
మొనసి తా నపుడు షణ్ముఖి యనుముద్ర