పుట:Rajayogasaramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27

ద్వితీయ ప్రకరణము

యనువొందఁగా మఱి యంతట నిలుచుఁ
దనర సుషుమ్న మంతట నిల్వ కరిగిఁ
ఘనతగఁ గ్రమముగఁ గ్రాలుచు నుండి
సరవిగ ఘనసహస్రారంబు సేరి
గురుతరంబుగ నందు గోప్యమై యుండు
దేహమధ్యంబునఁ దిరుగు జీవుండు
సోహం బటంచు సంశోభితంబుగను
మొనసి యహోరాత్రములను జపంబు
నొనరంగ నిరువదియొక్కవెయ్యారు
నూఱును జేసి యనూనంబు గాఁగ
నాఱు నూ ఱాదిగణాధీశునకును
ఆఱువే లాబ్రహ్మ కాఱ్వేలు హరికి
నాఱువే లారుద్రుఁ డనుదైవమునకు
వేయి సదాశివ విభవమూర్తికిని
వేయి యయ్యాత్మకు వేయి గుర్వుకును
వాసిగ దినమును వరుస నర్పణము
చేసినఁగాని యాజీవుండు మగుడి
భాసురమతి నిట్టిభావంబుగాను
శ్రీసద్గురునిమేటిరీతి నీలాగు50
కాశిగయాప్రయాగలు నంద యుండు
దేశికుఁ డటుమహాదేవుఁ డై యుండు
పోఁడిమి మీరఁ బెంపొందుచు మధ్య