పుట:Rajayogasaramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

ద్వితీయ ప్రకరణము

యొనరంగ వెన్నుఁ డం దొప్పుచు నుండు
పదియంగుళములకుఁ బైన నాహతము
హృదయప్రదేశమందిరముగ నుండు 20
భామవి న్ద్వాదశపత్రము ల్గలిగి
హేమవర్ణంబున నింపొందు నందు
నఖిలవాక్యావళి కాస్పదం బగుచు
కఖగఘఙలు చఛాఖ్యలు జఝఞణలును
ననువొందఁగా టఠా యనులింగముద్ర
దనరారు రుద్రుఁ డాస్థానాధిపతియు
నావల మఱి ద్వాదశాంగుళములను
ధావళ్యరుచి విశుద్ధంబు పదాఱు
దళములై, అఆలు దానికి వర్ణ
ములు నగునది మత్స్యముద్ర జీవుండు
అందుండు మఱి ద్వాదశాంగుళములను
బొందుగ భ్రూమధ్యమున దళద్వయము
అందుఁ బావకదీప్తి యలరుచు నుండు
నందు హంసలు రెండు నమరుచు నుండు
ధరణిఁ బ్రకాశముద్ర యనంగ నదియ
పరమాత్ముఁ డచ్చట ప్రభువై వెలుంగు
నందుకు నవల సహస్రారమందుఁ
గ్రందుగ నుండు హకారసకార
బీజద్వయం బాత్మబిందువుఁ గూడి