పుట:Rajayogasaramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

ప్రథమ ప్రకరణము

డెప్పు డైనను జీవుఁ డిదియెల్ల విడచి
యొప్పుగ విజ్ఞానయుక్తినిఁ గూడి 190
తన్ను దాఁ దెలిసిన ధన్యునిఁ జేరి
పన్నుగ నతనిచే బ్రహ్మంబు దెలిసి
కామాదిశత్రుల ఖండించివైచి
యామూక సకలేంద్రియాల జయించి
నిటలభాగంబున నిలిచి శోధించి
ఘటము బయల్జేసి కడఁగాంచె నేని
యతఁడ పరబ్రహ్మ మతఁడ స్వయంభు
వతఁడ మహావిష్ణు వతఁడ శివుండు
అతనికి వేఱలే దనుచు బోధింప
నతని కి ట్లనివల్కె నా దేవహూతి
మలమూత్రరక్త దుర్మాంసంబు చీము
గలిగిన దుర్గంధకాయంబులందు
నిరవుగ నాబ్రహ్మ మేరీతి నుండు
పరవి నా కెఱిఁగింపు సదయాత్మ యనఁగఁ
గపిలుఁ డాతల్లిని గరిమనుఁ జూచి
యపు డిట్లు వచియించె నమ్మరో వినుము
ఇది సోమనాథ విశ్వేశుని పేర
పదవాక్య భవ్యసుబ్రహణ్యయోగి
చరణాంబుజాతషట్చరణాయమాన
పరిపూర్ణ నిత్యసద్భావనిమగ్న