పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

రుక్మిణి యింటికిఁ బోవుట__గృహవర్ణనము__రాజశేఖరుఁడు గారు వచ్చి కచేరీచావడిలో గూర్చుండుట బంధుదర్శనము స్వహస్త పాకియైన వైశ్వదేవపరుఁడు.

సిద్ధాంతిగారి భార్యయు రుక్మిణియు బయలుదేఱి సోపానము లెక్కి వీధిపొడుగునను దేవాలయముదాఁక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడిచేతివంక నున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పు వైపు సందులోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుక తిరిగి రెండుమాఱులు మెల్లగా దగ్గెను. ఆ దగ్గుతో సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి 'అమ్మాయీ! నేనుందునా!'ఆవి వెనుక తిరిగి పలికెను.

రుక్మి __మంచిది. సోమిదేవమ్మగారూ ! నాకొఱకయి మీరు చుట్టు తిరిగి యింటికి వెళ్ళవలసి వచ్చినదిగదా?

సోమి__ఎంత చుట్టు? నిమిషములో వెళ్ళెదను.

రుక్మి__పోయిరండి.

సోమి__బీదవాండ్రము, మా మీఁద దయ యుంచవలెను జుండీ.

రుక్మి__దానికేమి? వెళ్ళి రండి. అని నాలుగడుగులు నడచి మరల వెనుక తిరిగి "సోమిదేవమ్మగారూ! చెప్ప మఱచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి వెళ్ళునప్పుడు మీరొక్క పర్యా యము వచ్చెదరు కాదా?"

సోమి__అవశ్యము. ఆలాగుననే వచ్చెదను. నేను పోయి వస్తునా?

అని సోమిదేవమ్మ నడచినది. పిద్ధాంతిగారు గాని, ఆయన

38