పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచిదని నా తమ్మునిచేత నవగ్రహ జపము చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులుగారినే 'పంచముఖి వీరహనుమంతము పునశ్చరణ చేయవలసిన దనియు, జపశాంతి కేమయిన గావలసియున్న ఏ రాజశేఖరుఁడుగారినైన కాళ్ళో కడుపో పట్టుకొని తెచ్చి నాలుగురూపాయల సొమ్మిచ్చుకోనైన నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టుమనియు ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందు చేతనే యీ నాలుగు దినములనుండి దర్శనము చేయలేదు గాని లేక పోయిన నేది యెట్లయినను నేను తమ దర్శనము మానుదునా?"

రాజ-"శాస్త్రిగారూ! మీరు రూపాయిల నిమిత్తము సంశయ పడ నక్కరలేదు. కావలసియున్న ఆ నాలుగురూపాయలను నే నిచ్చెదను. మఱి నాలుగురూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములలో కామావధానులుగారికన్న_" అని మిన్ను వంక చూచి యేమో యాలోచించుచుండెను. సిద్ధాంతి గారు చేసిన స్తుతి యమోఘముగాఁ బట్టుకొని కొంచెముగానో, గొప్పగానో ధనరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీవఱ కెన్నఁడును రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు.

ధవళేశ్వరము నందును చుట్టుపట్టుల గ్రామములయందును వేఱు సిద్ధాంతి లేఁడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్జ్య మొప్ప డని కాని, ప్రయాణముకు ముహూర్తము పెట్టుమని కాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుట కేదినము మంచిదని కాని, ఇల్లు కట్టుకొన నారంభించుట కేమాస మనుకూలమైనదని కాని, క్షౌరము చేయించుకొనుట కేవారము మంచిదని కాని, వివాహమునకు లగ్నము పెట్టుమని కాని, రజస్వల యయినప్పడు నక్షత్రము చెప్పు మని కాని, సదా యెవ్వరో యొక రాయన నడిగి పోవుచునే యుందురు. దూరబంధువులు పోయినప్పడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలె నన్నను, జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొంది నప్పుడు ఇల్లు వదలి యెంతకాలము లేచిపోవలెనో కనుఁగొనవలె

21