పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావం వుంది. ఆ ప్రభావం రాజశేఖర చరిత్రంపైన వున్నది. ఆందువలన ఇదే తొలి తెలుగు నవల ఆవుతున్నది.

రాజశేఖర చరిత్రం ఆంగ్లమూలానికి యధేచ్ఛానువాదం ఆయినా స్వకపోల కల్పితంగా రచింపబడ్డదా అన్నంత ప్రతిభా సమున్మిషితంగా వున్నది. సాంఘిక దురాచారాలను రూపుమాపటమే ప్రధాన లక్ష్యంగా రచింపబడినా, కావ్య సౌందర్యం ఇందులో గౌణం కాదు. ఆ రోజుల్లో వచన రచన వొజ్జబంతిలాగా సరళ సుందరమైన శైలీవిన్యాసంతో పంతులుగా రీ నవలను రచించారు.

సమకాలీన సారస్వతేయులలో, పాఠకులలో గొప్ప ఆదరాభిమానాలను పొందింది యీ నవల. ఎన్నోమార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎన్నిక చేయబడ్డది. సాంఘిక రంగంలోనూ, సారస్వత విషయం గానూ వీరేశలింగం పంతులు గారితో ప్రబలమైన స్పర్థ వహించివున్న కొక్కొండ వేంకట రత్నం పంతులుగారు, తమ 'బిల్వేశ్వరీయ' మన్న మహా గ్రంథాన్ని పంతులుగారికి పంపుతూ, తమ సుహృద్భావాన్ని యీ విధంగా వెల్లడి చేశారు.

ఆ రోజుల్లో గొప్పగొప్ప పండితులూ, కవులూ, తమ గ్రంథాలను పంతులుగారి ఆభిప్రాయం కోరుతూనూ, ఆభినందనలతోనూ పంపుతూ వుండేవారు, 'బిల్వేశ్వరీయం' పంపుతూ- కొక్కొండ యీ విధంగా లోపలి మొదటి పేజీపై వ్రాశారు:

'ముందుగ దెనుగున బలు గబ్బంబుల
ముద మందం జేయుట చేతన్
సుందరముగ రాజశేఖర చరిత
జొప్పడగం జెప్పుట చేతన్
కందుకూరి వీరేశలింగ మను కవి కిది
కవిమణి నామకృతిన్
పొందుగ బిల్వేశ్వరీయము న్మే
ల్వొందగ వేంకటరత్న మిడెన్