పుట:Raajasthaana-Kathaavali.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

రాజస్థానకథావళీ,


విశ్రాంతకీతి౯యు నగుపృథివి రాజున కొక కుమారుఁడు గలఁడు. వాని పేరు వనవీరుఁడు. హిందీ భాషలో వానిని బన్బీరుఁ డందురు. అతనిని చిత్తూరు రాజ్యసంరక్షకునిగా నేర్పఱచు టుచిత మని వారు నిశ్చయించిరి. అతఁడు బలసంపన్నుఁడును సింహవిక్రముఁడు నగుపృథివి రాజునకుఁ గుమారుఁడు నగును గాని దాసిపుత్రుఁ డగుటచేత వానిని వారు రాణాగాఁ జేసికొనఁజాలక కొన్ని సంవత్సరములపాటు చిత్తూరు రాజ్యమున కతఁడు సంరక్షకుఁడు గా నుండి దానిని గ్రమస్థితిలోనికిఁ దెచ్చినపక్షమున నింతలో నుదయసింగు యుక్తవయస్కుడై పరిపాలనకుఁ దగినవాఁ డగునో కాఁడో తెలిసికొనుటకు వీలు గలుగునని నిశ్చయించిరి.

వనవీరుఁడు తొలుదొ ల్త సందేహించి సూర్యవంశ ప్రదీపకులు మహాసాహసులు నగు చిత్తూరు రాజులు పాలించిన రాజ్యమును తనవంటి హీనకులజుఁడు పాలింపఁదగదనియుఁ గావున తన కదిష్టము లేదనియు వారిం బ్రార్థించెను. "కాని రాజపుత్రవీరు లందఱుఁ జిత్తూరు రాజ్యము యొక్క దురవస్థను వర్ణించి చెప్ప రాజ్యలక్ష్మి నట్టిదురవస్థనుండి తప్పింపఁగల సమర్థు డతఁడు తక్క. వేరొకఁడు లేఁడని నొక్కి పలికి బ్రతిమాలుటచే వారిమాటం దోసిపుచ్చలేక యెట్టకేల కతఁ డంగీకరించెను.

కార్యగతు లిట్లుండ విక్రమజిత్తుని సవతితమ్ముఁడగు నుదయసింగు పసి బాలుఁడగుటచే రాజపుత్ర ప్రభువులు చేయు కుట్రలెఱుఁగక యాకలి యగునప్పుడు భుజించుటయు వేడుక గలిగినప్పు డాడు కొనుటయు నిద్రవచ్చినప్పుడు పవ్వళించుటయు వ్యాపారములుగ నంతి పురమున బెణుగు చుండెను. తల్లిదండ్రులు చిన్న తనమందే గతించుటచే పున్న యను నొకదాసి వానికిఁ దల్లియై పెనుచుచుండె అది తల్లిగా తన యీడువాడగు దాని కోడుకు తనకుం జెలి కాఁడుగా నుదయసింగు క్రమక్రమముగా నభివృద్ధి పొందుచుండె.