పుట:Raadhika Santhvanamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె. (స.రా.సా. 97)

ఇందుబింబాస్య చిఱునవ్వు కెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె
నింతినునుగొప్పుకప్పున కెంచి చూడఁ
గాలమేఘంబు సరిసాటి గాదనంగ. (మ.ప.రా.సా. 3 153)

ఇట పళని పద్యమున నాల్గవపాదము పూర్తిగా మాఱిపోయినది. ఆమెకు సముఖము పద్యములోని సభంగశ్లేష యర్థము కాలేదేమో! ముద్దుపళనిగ్రంథము ముద్రితప్రతులు మఱి రెండిటఁ బై పద్యపుటుత్తరార్ధమునకు మాత్రము ‘తీవబోడి కనుల తీ రెంచి చూచిన, జలజపత్రవితతి సమము గాదు’ అను పాఠాంతరము గన్పించుచున్నది. కాని యది యొక దోపుడుపుల్లు. పద్యపూర్వార్ధము తేటగీతిలో నున్నది. పాఠాంతర మాటవెలఁది. కావున నది యపరిగ్రాహ్యము.

అపుడు నచ్చట రాధ కంసారిరాక
చిలుకచే విని తన వద్ది చెలులఁ బిలిచి
వెన్నుఁ డిట కేఁగుదెంచిన విడువవలదు
వాకిటనె నిల్పుఁ డని చెప్పి పనిచె నంత. (స.రా.సా. 101)

ఇటులఁ జనుదెంచు హరిరాక యెఱిఁగి చిలుక
చెప్ప విని రాధ తన యొద్ది చెలులఁ బిలిచి
శౌరి యిట వచ్చె నని వింటి పరగ వాని (మీరలతని -పా)
విడక నిల్పుఁడు మోమోట మిడక యిందె. (ము.ప.రా.సా. 4-5)

ఇటుల నాడిన మాటల కిముడఁ బలికి
రాజసము మీఱఁగా యదురాజమౌళి
బలిమి జులుముల సందడుల్ దొలఁగఁ ద్రోచి
చొరవఁ జేసుక లోపలఁ జొచ్చువేళ. (స.రా.సా. 104)