పుట:Punitha Matha.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరుగునుగాక అని ధైర్యంగా పలికింది. మరియు పిరికిది కాదు, సాహసవంతురాలు. 2. ఎలిసబేతును సందర్శించడం :

మరియు తన బంధువైన యెలిసబేతుకు పురుడుపోయడానికి పోయింది. ఈ సందర్భంలో ఆమె మహిమగీతం ఆలాపించింది. ఈ పాట బయటికి చూడ్డానికి భక్తిమంతంగానే వుంటుంది. కాని యిది గొప్ప విప్లవ గీతం. దీనిలో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మతపరంగా గూడ గొప్ప విప్లవ భావాలున్నాయి. ధనవంతులు దైవరాజ్యాన్ని కోల్పోతారు. అది పీడితులకు దక్కుతుంది. పవిత్రుడూ, శక్తిమంతుడూ, కరుణామయుడు ఐన ప్రభువే దాన్ని పీడితులపరం జేస్తాడు. దీనులు విజయాన్ని చేపడతారు. అహంకారులు మన్ను గరుస్తారు. ఈలాంటి పాటను విన్పించిన వ్యక్తి గుండెల్లో ఎన్ని తిరుగుబాటు భావాలున్నాయో ఊహించవచ్చు. మరియు మన మనుకొన్నట్లుగా వట్టి తీయని తల్లీ, లోకంపోకడ లెరుగని భక్తురాలూ కాదు.

3. ఎలప్రాయపు తల్లి :

నిండు చూలాలైన మరియు 90 మైళ్లు నడిచి బేల్లెహేము చేరుకొంది. కనుక ఆమె మనం మామూలుగా దేవమాత చిత్రాల్లో చూచే సుకుమారి కాదు. దేహదారుఢ్యం గల మహిళ.బేల్లెహేములో ధనవంతులు మరియా యోసేఫులకు ఆశ్రయం నిరాకరించారు. కనుక ఆమె వ్యధకు గురైంది. నేడు మురికి వాడల్లో నివసించే పేదవారిలాంటి దైంది. సమాజం అనాదరణకు గురైంది. జంతువులూ పామరులైన గొర్రెల కాపరులూ ఆమెకు సహ్రచరులయ్యారు. ఈ పట్టున ప్రాచీన