పుట:Prasarapramukulu022372mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ప్రసార ప్రముఖులు.

నండూరి సుబ్బారావు :

విజయవాడ కేంద్రం నాటక విభాగంలో డ్రామా వాయిస్‌గా మూడు దశాబ్దాలు పనిచేసిన సుప్రసిద్ధులు నండూరి సుబ్బారావు. ఆయన బందా కనక లింగేశ్వరరావు హయాంలో ఆకాశవాణిలో చేరి ఎన్నో నాటకాలు నాటికలు వ్రాశారు. స్వయంగా రచయిత, నవలా కారుడు. వీరిగణపతి పాత్ర పోషణ, సక్కుబాయిలో కాశీపతి పాత్ర, వరవిక్రయం శ్రోతల్ని అలరిస్తూ వుంటాయి.

1933 జులై 7న కృష్ణాజిల్లా ఆరుగొలనులో జన్మించిన సుబ్బారావు బందా వారి సౌజన్యంతో 1960 ఆగస్టులో రేడియోరంగ ప్రవేశం చేశారు. 1961 జనవరి నుండి Drama Voiceగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి 1990 ఆగస్టు 31 న రిటైరయ్యారు.

20 నవలలు, రెండు రేడియో నాటక సంపుటాలు ప్రచురించారు. వీరి నవలల్లో ఆటబొమ్మ, దీపంజ్యోతి, అతకని బ్రతుకులు, విరిగిన కెరటాలు, వెన్నెల విలువెంత? మన శీనయ్య సంసారం, రాగరంజిక ప్రముఖాలు. పిల్లల నాటికల సంపుటి గూడా ప్రచురితమైంది. వీరు విశ్రాంత జీవితాన్ని విజయవాడలో గడుపుతున్నారు.

విక్రాంతగిరి శిఖరం, భగవాన్ రమణ మహర్షిరూపకాలలో వీరు శ్రీ గోపాల్‌తో కలిసి ప్రొడక్షన్ టీమ్‌లో పనిచేసి జాతీయస్థాయి ఆకాశవాణి బహుమతులందుకొన్నారు.

సంగీత కళాకారులు

శ్రీరంగం గోపాలరత్నం :

తనదైన మధుర కంఠస్వరంతో భక్తిరంజని ద్వారా శ్రోతల హృదయాలలో స్థానం సంపాదించుకున్న కుమారి శ్రీరంగం గోపాలరత్నం విజయవాడ కేంద్రంలో దాదాపు 20 సంవత్సరాలు స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత పదవీ విరమణ చేసి సికిందరాబాదు సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1994 లో వీరు అనారోగ్యంతో మరణించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత సభల ద్వారా, భక్తిరంజని ద్వారా, రేడియో నాటకాల ద్వారా వీరు ఆంధ్రలోకానికి పరిచితులు