పుట:Prasarapramukulu022372mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

ప్రసార ప్రముఖులు.

వింజమూరి శివరామారావు (1908-82)

శివరామారావు పిఠాపురం తాలూకా చంద్రపాళెంలో 15-5-1908లో జన్మించారు. ప్రముఖ అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వీరి మేనమామ. శివ రామారావు కలం పేరు 'గౌతమి'.

శివరామారావు ఆకాశవాణిలో రెండు దశాబ్దాలు (1949-68) స్క్రిప్ట్ రైటరుగా విజయవాడ కేంద్రంలో పనిచేశారు. ఆకాశవాణిలో చేరడానికి ముందు పత్రికలలో పనిచేశారు. ' జ్వాల ' పత్రికలోను, నవోదయ పత్రికలోను సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. పద్యాలను, గేయాలను సమప్రతిభతో వ్యాయగల నేర్పరి. ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. ఈయన అనువాద రచనలో కూడా సమర్ధులు. అమరుకం, మొపాసా కథలు, గోర్కీ కథలు వీరి అనువాద సామర్థ్యాన్ని చాటిచెబుతాయి. కల్పవల్లి ఈయన ఖండ కావ్య సంపుటి. విజయపతాక, కళారాధన, రజకలక్ష్మి, కళోపాసన, కృష్ణదేవరాయలు, విశ్వామిత్ర నాటకాలుగా ప్రసిద్ధాలు. 1982లో వింజమురి శివరామారావు విజయవాడలో కాలధర్మం చెందారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వింజమూరి వారిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.

ఏడిద కామేశ్వరరావు:

రేడియో అన్నయ్యగా పరిచితులైన ఏడిద కామేశ్వరరావు 1913 సెప్టెంబర్ 12న తూర్పుగోదావరి జిల్లా ఏడిదలో జన్మించారు. మండపేట, రాజమండ్రిలో విద్యాభ్యాసం చేశారు. 1930 లో శాసనోల్లంఘ నోద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. 1935-40 మధ్యకాలంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

1936లో మదరాసు ఆకాశవాణి కేంద్రంలో బాలల కార్యక్రమంలో ప్రయోక్తగా చేరారు. అంతకుముందు గృహలక్స్ఝి, ప్రజామిత్ర, మాతృభూమి పత్రికలలో ఉప సంపాదకులుగా పనిచేశారు. 1949 నుండి ఆకాశవాణి విజయవాడలో పిల్లల కార్యక్రమాల ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

1952లో బాలబంధు బిరుదుతో కామేశ్వరరావు సత్కరింపబడ్డారు. సుమారు 500 పాటలు, 500 బాలల నాటికలను వ్రాసి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేశారు. పదవీ విరమణ చేసి 1996 తొలిభాగంలో కామేశ్వరరారు పరమపదించారు.