40
ప్రసార ప్రముఖులు.
సుధామ :
అల్లంరాజు వెంకటరావు 1951 నవంబరు 25న జన్మించారు. చిన్నతనం నుండి (1966 నుండి) బాలబంధులో రచనలు ప్రచురించారు. కార్టూన్ చిత్రకారుడుగా ప్రసిద్ధుడు. యువభారతి సాహితీ సంస్థద్వారా సేవలు చేశారు. 80-81 ,అధ్యకాలంలో తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావవీచికలు M. Phil పట్టాకోసం సమర్పించారు. 1983లో ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనంలో తెలుగుకవిగా పాల్గొనడం విశేషం. 1978లో ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా హైదరాబాదు కేంద్రంలో చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా 91లో విజయవాడ బదలీ అయ్యారు. తిరిగి 95లో హైదరాబాద్ వెళ్ళారు. వీరి సతీమణి ఉషారాణి కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్. సుధామ కళాకరుడు, రచయిత, కార్టూనిస్టు. 1990 లో వీరు ప్రచురించిన అగ్నిసుధ గేయకావ్యం ప్రొద్దుటూరులో ఉమ్మిడిశెట్టి కవితా అవార్డు పొందింది. ఉషారాణి 1958 జులైలో జన్మించారు. 1951 నుండి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా విజయవాడ, హైదరాబాద్లలో పనిచేస్తున్నారు.
ఇంకా మంత్రవాది మహేశ్వర్, వసుమతి దంపతులు, శేషం రామానుజాచార్యులు, కలగా కృష్ణమోహన్ కృష్ణమాచారి, రావు చౌదరి, విద్యాలంకార్, అస్లం ఫర్షోరి, డా|| కె. విజయ, డా|| ప్రసన్న, శైలజామూర్తి, డా|| P. V. శారద, వినయమణి యింకా ఎందరెందరో ఆ యా రంగాలలో పనిచేసి ఖ్యాతి గడించారు.
అనౌన్సర్లలో డా|| పండా శమంతకమణి సాహితీ రంగంలో కృషిచేశారు. వీరు రచించిన తెలుగులో రామకథకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. జ్యోత్స్న, ఇలియాస్ అహమ్మద్, రతన్ప్రసాద్, చిన్నక్క' వట్టం సత్యనారాయణ, (బాలయ్య) మట్టపల్లి రావు, ఇందిరా బెనర్జీ, ఉమాపతి బాలాంజనేయశర్మ, రాజగోపాల్ రెండు దశాబ్దాలుగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి శ్రోతల ప్రశంసలందుకొన్నారు.