పుట:Prasarapramukulu022372mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ప్రసార ప్రముఖులు.

M.S.S. ప్రసాద్ :

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గుంటూరు జిల్లా రేపల్లెలో 1954 ఆగస్టు 20న జన్మించారు. ఎం. ఏ. పట్టభద్రులయి 1975 ఆగస్టులో U. P. S. C. ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి విశాఖపట్టణం, కడప కేంద్రాలలో పనిచేశారు. వయొలిన్ వాద్యంలో శివప్రసాద్ ప్రావీణ్యం సంపాదించారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది విజయవాడ బదిలీ అయ్యారు.

K. V. హనుమంతరావు :

జానపద సంగీత ప్రయోక్తగా హనుమంతరావు కీర్తి గడించారు. హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో జానపద సంగీత ప్రయోక్తగా ఒక దశాబ్దిపైగా పని చేశారు. 1984లో వీరు రూపొందించిన 'లయ', కృష్ణవేణి రూపకం (85) జాతీయ స్థాయిలో బహుమతి పొందారు.

1984లో వీరి లయ హోసబ క ఫౌండేషన్ జర్మనీవారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. హనుమంతరావు మార్కాపురం కేంద్రం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా 94-96 మధ్య పనిచేశారు. 96లో దూరదర్శన్ ఇంఫాల్ కేంద్రానికి బదిలీ అయ్యారు. కృష్ణవేణి, శ్రమఏవ జయతే రూపకాలు కూడా జాతీయ బహుమతులు పొందాయి.

ప్రహరాజు పాండురంగారావు :

పాండురంగారావు 1940 జూన్‌లో నరసాపురంలో జనిమించారు. ప్రోగ్రాం సెక్రటరీగా ఆకాశవాణిలోచేరి ట్రాన్సిమిషన్ ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో పనిచేశారు. పాండుగారు నటుడుగా హాస్యవల్లరి కార్యక్రమాలు రూపొందించడంలో సిద్దహస్తులు. పాండురంగారావు సమర్పించిన నీలినీడలు 1980లో జాతీయ బహుమతి పొందింది. పాండురంగారావు 94 నుండి నిజామాబాద్ ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.