పుట:Prasarapramukulu022372mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

ప్రసార ప్రముఖులు.

నండూరి విఠల్:

తన కమ్రకంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదుల్లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూరదర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పని చేశారు. వీరి విషకన్య నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణలపేర విజయవాడలో పుస్తకాలు ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్చంద పదవీ విరమణ చేసి 1994 లో హైదరాబాదులో మరణించారు.

వేలూరి సహజనంద:

వేలూరి వంశంలో జన్మించిన సహజానంద హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచ వర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పని చేశారు. పంచవర్ష ప్రణాలికల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృత కృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాల మరణం చెందారు. రచయితగా సహజానంద ప్రసిద్ధులు.

డా. రామమూర్తి రేణు:

హిందీలో సుప్రసిద్ధవిద్వాంసులైన వారణాసి రామమూర్తి గారు, రామమూర్తి రేణుగా ప్రసిద్ధులు. హిందీ ప్రసంగాల విభాగాన్ని హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు నిర్వహించారు. వీరు వ్యాఖ్యాతగా కూడ పరిచితురు. వీరు హైదరాబాదులో విశ్రాంతి జీవన గడిపారు.

N.V.S. ప్రసాద రావు:

తెనాలి వాస్తవ్యులయిన N.V.S ప్రసాద రావు ఆకాశవాణిలో 64 ప్రాంతాల్లో హైదరాబాదు కేంద్రంలో గ్రామీణ కార్యక్రమాల ప్రొడ్యూసర్ గా చేరారు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబందాలు గల ప్రసాదరావు గ్రామీణ కార్యక్రమాల రూప కల్పనలో సిద్ధ హస్తులు. 1980 లో రిటైర్ అయిన తర్వాత కొంత కాలం రాష్ట్ర వ్వవసాయశాఖ నడిపే మాస ప్రత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఆ తర్వాత రవీంద్ర భారతి డైరక్టర్ గా వ్వవరించారు. హైదరాబాదు లోని వివిధ సాంస్కృతిక సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధం. వీరి కుమార్తె సుశీల హైదరాబాదు కేంద్రంలో అనౌన్సర్ గా పనిచేస్తున్నారు.