పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్యూజియము వస్తుసేకరణలో పెక్కు చిక్కు లుండెడివి. దారి డొంక లేని యొక కుగ్రామములో నొక చారిత్రాత్మక సుందర శిలా విగ్రహము కల దనియు, దానికై యెవరో బొంబాయి నుండి ధనవంతులు వచ్చిరనియు, ఆలస్యమైనచో తెలుగునాడు దాటిపోవుననియు తెలిసెడిది! సరి! అంతటితో శరీర శ్రమను లెక్కసేయక ఏదో రీతి నటకు చేరెడి వారు శ్రీ శాస్త్రి గారు. ఆ విగ్రహమే పుంత లోనో పడియుండెడిది. పసులకాపరులు కత్తి నూరుకొనుటకో, బాటసారులు కాలిబాడి వదల్చు కొనుటలో అది ఉపయోగపడుచుండెడిది. త్రవ్వి తీయుటకు తోడు దొరకరు. వెలికి తీసి దాని ప్రాముఖ్యమును దెలిపిన పిమ్మట ఊరివారు ఆ విగ్రహము నంచుకొని మేమే ఆరాదించుకొందుమని యడ్డగింతురు. వారిని సమాధానపఱచి ఆయా వస్తువులను తిరుపతి చేర్చుట యన లక్కయింటి నుండి ఏక చక్రపురమునకు చేరు నంతటి కధ! ఈ పని నంతయు శ్రీ శాస్త్రిగారు తమ ప్రియాంతే వాసులను, అందును ఉదయగిరి శ్రీనివాసాచార్యులను నూతగఱ్ఱగా గొని ఏ డెన్మిది నెలలలో బహు స్వల్ప వ్యయముతో నిర్వహించిరి. వేరొకరైనచో మంది సిబ్బందులతో గూడియైన, ఎంత ధనమో వెచ్చించియైన, నిరువ దేండ్లలోపున నైన ఈ పనిని సాధింప గల్గుదురా యని యెఱుక గలవారల చ్చెరువుఁజెందిరి.

   ఈ సందర్భమున నొక విషయము స్ఫురణకు వచ్చుచున్నది. గుంటూరులో నొక నూత్న పరిచయునికడ