పుట:Prabodhanandam Natikalu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ్డనామం :- అరే నీకు, నాకు వాదనవద్దు ఇది మనతాత, ముత్తాల నుంచి వచ్చిన తెగని పంచాయితి, కాబట్టి ఎవరు నిజమైన దేవుడో ఆ దేవుళ్ళను అడిగి తేల్చుకుందాము.

--సీన్‌ నెం.2--

(ఇరువురు, దేవుళ్ళ జాడకోసం అనేక స్వామీజీలను అడుగుతూ, దేశమంతా తిరుగుతూ చివరకు హిమలయాలకు చేరుకొని అక్కడ కొలువైవున్న త్రిమూర్తులను చూస్తారు.)

అడ్డనామం :- ఆహా! ఏమి నాఅదృష్టం! నేను ఆరాధించే పరమశివుడు నాకు కనిపించాడా? ఇది కలా? లేక నిజమా? తన్నుతాను గిల్లికుంటూ (శివ, శివ, శంకర)...పాట

నిలువునామం :- ఓహోహో! ఏమిఠీవి, ఏమిఠీవి నా నారాయణమూర్తిని చూసిన నేను, ఎంతో ధన్యుడని ఇందుగలడందుగలడు ఎందెందు చూసిన అందందే కలడంటారే, కానీ ఎక్కడెక్కడో వెతుకుతువుంటే ఇక్కడ దర్శన మిచ్చావా! నాతండ్రి...(పాట)

అడ్డనామం :- తండ్రీ, పరమాత్మా, శంకరా! నిన్ను చూచిన ఆనందములో అన్నీ మైమరచిపోతున్నానే, ఈ ఆనంద సమయములోనే నన్ను నీలో కలుపు కోగలవా తండ్రీ. ఈ జన్మలు ఇకచాలును, ఈ బాధలు ఇక చాలును, ఈ చరాచర సృష్ఠికి ఈశ్వరుడిగా పిలువబడుచున్న నీవేగదా అసలైన దేవుడివి. నిన్ను గూర్చి ఎన్నో పురాణాలలో విన్నాను. నీ మహిమలు ఎన్నో తెలుసుకున్నాను. ఎందరి కోర్కెలనో తీర్చిన మహానుభావుడివి నీవేకదా నిజమైన దైవానివి, మీ తర్వాత చరిత్రలో చెప్పుకుంటున్న విష్ణుమూర్తిని అసలైన దేవుడని ఈ నిలువు నామము వాడు అంటున్నాడు, తండ్రీ వీడికి నీవే అసలు దేవుడివని నీవైన చెప్పు.