పుట:Prabodhanandam Natikalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేణు :- తాతయ్యగారు నిజమైన యోగవిధానాలు తెల్పు గ్రంథము కావలయునంటే వినుము.

పద్యం :కం॥

నిక్కమగు ధర్మమార్గము
చక్కగ నెరిగించునట్టి సత్‌ శాస్త్రంబున్‌
యెక్కడో వెదకగ నేలను
మక్కువగను గీతయొకటె మహిలో తాతా

పూర్ణయ్య :- ఏమి నాయనా భగవద్గీతయా! అదికూడ పురాణాంతర్గత మైన గ్రంథమే గదా?

వేణు :- ఏ పురాణంలో ఉందంటారు.

పూర్ణయ్య :- మహాభారతములో శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించినదే కదా!

వేణు :- ఆ! అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. భారత, రామాయణాలు పురాణాల్లోకి చేరవు. అవి ఒక ఇతిహాసగాథలు. పురాణాలు వేరు, ఇతిహాస గాథలు వేరు, శాస్త్రములు వేరు.

పూర్ణయ్య :- నేనంతలోతుగ ఆలోచించలేదు నాయనా, ఇక ఇప్పటి నుండి పురాణాల గొడవలు మాని, నీవు చెప్పినట్లుగా భగవద్గీతను భక్తిగా పఠించి, పరమార్థతత్త్వాన్ని గ్రహించి పరంధామానికి దగ్గరౌతాను. నీకు చెప్పిన మాటప్రకారం ఈ పురాణపుస్తకాలను ఇప్పుడే కట్టగట్టి గంగలో పారేస్తాను. (అని భాగవతం చేతులలోనికి తీసుకొని) ఓ పురాణ పుస్తకముల్లారా! నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మిమ్మేపఠించి, ఆరాధించి నాను. మీ వలన ఏ ఉపయోగము లేదని ఈనాడే తెలుసుకొన్నాను. ఇంక ఇప్పటితో మీకూ, నాకూ రుణం తీరిపోయింది (అని భాగవతాన్ని తన భూజము పైనున్న వల్లెలో మూటగట్టుకొని నెత్తిమీద పెట్టుకొని పోవుచుండగా)