పుట:Prabodhanandam Natikalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేణు :- బాగా ఆలోచించు తాతగారు. మోక్షము కావలనుకొనే వారు శాస్త్రబద్దమైన ధర్మాలు తెలుసుకోవాలి, కానీ శాస్త్రసమ్మతంగాని పుక్కిటి పురాణాలను పట్టుకొని ప్రాకులాడితే చివరకు మిగిలేవి చిక్కులు చీకాకులే. పురాణాలు కేవలం కాలక్షేపానికి పనికివస్తాయి, కానీ కర్మ కాల్చుటకు ఉపయోగించే జ్ఞానం ఉండదు.

పూర్ణయ్య :- (తలపంకించి) నిజమే నాయనా నిజమే! చిన్నవాడవైనా నా కళ్ళు తెరిపించావు. నాకు ఇప్పుడు బుద్ధివచ్చింది, బాగా అర్థమౌతున్నది. నీవే అటువంటి ప్రశ్నలతో పురాణాల్లోని బండారాలన్నీ బయటికి లాగకపోతే, మిగిలిన నా జీవితకాలం వాటితోనే వ్యర్థం చేసుకొనేవాణ్ణి, అసలు నీకు ఇటువంటి పాయింట్లు తెలిపిన మహానుభావుడెవరు?

వేణు :- ఇంకెవరు మా గురువే.

పూర్ణయ్య :- ఆహా! ఆయన నిజంగా భగవత్సరూపుడే, లేకుంటే ఎంతో తార్కిక జ్ఞానముతో ఇంతవరకు ఎవ్వరూ విమర్శించని పురాణాలను, శాస్త్ర సమ్మతంగా విమర్శించి, అందులోనున్న అసహజమైన కవితాశైలిని అందరికీ తెలిసేలాగున చేశాడు. ఆయన పేరేమిటి? ఆయన ఆశ్రమం నామమేమిటో తెలుపు నాయనా! నేను కూడ ఆయన్ను దర్శించి కృతార్థుడనవుతాను ఇటువంటి గొప్ప విజ్ఞానియైన గురువును నీవు సేవిస్తున్నందుకు నీ జీవితము ధన్యమైంది నాయనా. నాకు కూడ ఇప్పుడు మోక్షప్రాప్తికి ఉపకరించే జ్ఞానం తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ


తే॥గీ॥

పరమపదమును జేర్పంగ తరముగాని
పుక్కిటి పురాణముల నమ్మి నిక్కముగను
కాలమంతయు రిత్తగా గడిపితేను
సత్యధర్మంబు లెరిగించు శాస్త్రమేది