పుట:Prabodhanandam Natikalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎల్లయ్య :- అటువంటి దేవుడు ఒకడున్నాడని పూర్వము ఎవరికైనా తెలుసునా? పూర్వము ఆయనను ఎవరైనా పూజించారా?

గిరి :- పూర్వము పరమాత్మను గురించి చాలామందికి తెలుసు. అందువలన త్రేతా యుగములోనే శ్రీరాముడు, రావణుడు, మానవాకారములేని గుండును దేవుని గుర్తుగా చేసి పూజించారు. అంతకుముందు సృష్ఠి ఆదిలోనే విష్ణు, ఈశ్వర, బ్రహ్మలైన త్రిమూర్తులు, వారికే తెలియని దేవునికొరకు ఎంతో తీవ్రముగా యోచించారు.

ఎల్లయ్య :- ఏమిటీ త్రిమూర్తులు కూడ ధ్యానించారా?

గిరి :- అవును త్రిమూర్తులను కూడ పుట్టించినవాడే సృష్ఠికర్తయిన దేవుడు. ఆ దేవున్ని గురించే పరమ, పవిత్ర, పరిశుద్ధ గ్రంథమైనభగవద్గీత కూడ చెప్పిది.

ఎల్లయ్య :- నేను నీ మాటను నమ్మను. ఇంతకాలము నేను పూజించిన పరాశక్తినే ఈ విషయము అడుగుతాను.

గిరి :- వీలైతే అడుగు.

ఎల్లయ్య :- అమ్మా! పరాశక్తీ! దేవుడెవరు అను సంశయాన్ని నీవే తీర్చాలి. ఈ విషయము నాకే కాదు సమస్త మానవాళికి తెలియాలి. నీవు మమ్ములను కరుణించి, మాకు కనిపించి ఈ విషయము చెప్పు తల్లీ.

(అంతలో పరాశక్తి స్టేజి మీద కనిపిస్తుంది.)

పరాశక్తి :- నేను దేవుణ్ణి ఏమాత్రము కాదు, ఒక దేవతను మాత్రమే. దేవుడెవరో తెలియాలంటే భగవద్గీతలో నేనే దేవున్ని అన్న శ్రీకృష్ణుణ్ణే అడగండి.

గిరి :- గీతను బోధించిన కృష్ణా! ఈ విషయమును నీవే చెప్పాలి. మా మాటను ఆలకించి మా సంశయమును తీర్చుము.