పుట:Prabodha Tarangalul.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

481. భూమి మీద మనుషులు గ్రహములుగ (దయ్యములుగ) గుడిలోని దేవతలు విగ్రహములుగ ఉన్నారు.

482. దేవాలయముల ప్రతిమలలో దేవతలను జీవుళ్ళుండగ మనుష శరీరములలో సాధారణ జీవుళ్ళు గలరు.

483. దేవాలయములో స్థూలముగనున్న ప్రతిమలుపు పరమాత్మను తెలుపు చిహ్నములని తెలియక అక్కడున్న దేవుళ్ళను ప్రజలు ఆరాధిస్తు దేవదేవుడైన పరమాత్మను గుర్తించలేక పోవుచున్నారు.

484. దేవాలయములు భావ సహితమైన కట్టడములుగ, పరమాత్మ జ్ఞానమును బహిర్గతము చేయునవిగ, గురుబోధనకు సమానమైనవిగ ఉండవలెను.

485. పూర్వము పెద్దలచే నిర్మింపబడిన దేవాలయములు రెండే. అవి ఒకటి నిరాకార ప్రతిమయైన లింగము గల గుడి. రెండవది ఆకారముతో కూడుకొన్న రంగని గుడి.

486. లింగము మీద మూడు ఆత్మలను సూచించు మూడు విభూతి రేఖలను, రంగని ప్రతిమ మీద శరీరములో బ్రహ్మనాడియందే దేవుడున్నాడని సూచించు మూడునాడుల గుర్తయిన నామమును తీర్చిదిద్దారు.

487. కాలక్రమమున లింగము శైవుల దేవుడని, రంగడు వైష్ణవుల దేవుడని భావించబడి నేటికి శైవుల ఆధీనములో లింగము వైష్ణవుల ఆధీనములో రంగడు గలడు.

488. రూపము లేని దేవుడు, రూపముగల భగవంతునిగ వచ్చునని