పుట:Prabandha-Ratnaavali.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 ప్రబంధరత్నావళి

సీ. పదపద్మరజమునఁ బాషాణపుత్రికఁ బూఁబోఁడిఁ జేసిన పుణ్యుఁ డితఁడు
బాలుఁడై హరధనుర్భంగంబు సీతకు నుంకువ సేయు నిశ్శంకుఁ డితఁడు
మణిమయంబై యున్న మాయాకురంగంబుఁ గడఁగి చంపిన వేఁటకాఁ డితండు
కట్టాణిముత్యంబు కైవడి మున్నీరు బాణాగ్రమున నిల్పు ప్రౌఢుఁ డితఁడు
తే. ప్రబలదశకంఠ పటుకంఠనిబిడవిపిన
దహన కీలాయమానదోర్దండచండ
చటులకోదండ నిర్ముక్తశరనికాయుఁ
డితఁడు కాకుత్స్థవంశాబ్ధి హిమకరుండు. (జ) 118

గంగాధరుఁడు, కాకమ్రాని [బాలభారతము] (ఆం)

గీ. అట యుధిష్ఠిరుఁ డప్పంకజాక్షితోడ
ధౌమ్యహితవహ్ని ధూమకందళితశిఖలు[?]
మగువఁ గూడిన రాయంచ మధుపశబల
నలినములఁ బోలెను బ్రదక్షిణంబు సేసె. (ఆం) 119

ఉ. ఆంధ్రకవిత్వతత్త్వ సముదంచితకీర్తినిఁ దిక్కయజ్వ నీ
రంధ్రతరప్రభావనిధిం బ్రస్తుతిసేయుఁదు [?] నుల్ల స
త్కంధ్రగభీరమంజుతర గర్జిత విభ్రమభవ్యభంగి సై
రంధ్రికయైన చాటుమధురస్ఫుటబంధుర వాగ్విజృంభిగన్. (ఆం) 120

శా. ఆ లజ్జావతి ధౌమ్యుపంపున శిఖివ్యాలోలకీలాలిపై
నోలి న్వేల్చిన లాజరాజి పవనప్రోద్ధూతవారాశి వీ
చీలోలోత్థితవిద్రుమాటవి నధిక్షేపించు కట్టాణి ము
త్యాలో నాఁ గనుపట్టె నట్టియెడ నందద్రాజహంసంబుగాన్. (ఆం) 121

క. ఇంద్రప్రస్థం బనుపురి
సాంద్రమహేంద్రాశ్మకాంతిసంతతులను ని
స్తంద్రంబై విలసిల్లెను
జంద్రాతప ధవళచంద్రశాలాయుతమై. (ఆం) 122

గీ. ఇంద్రమణిజాలకములందుఁ జంద్రముఖుల
వాలుఁగన్నులు యమునయావర్తములను
మెలఁగి యాడెడు వాలికమీ లనంగ
......... కనుపట్టు నీ పట్టణంబునందు. (ఆం) 123