పుట:Prabandha-Ratnaavali.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53


35. విక్రమసేనము - ఈ సీసపద్యమున 3, 4 చరణములు ఎత్తుగీతి, ఎఱ్ఱన నృసింహపురాణములోని 3-84 పద్యముతో సరిపోవు చున్నది. ఈ పద్యము 557 గా అజ్ఞాతక ర్తృత్వముగా నున్నది.

శ్రీనాథ యుగము (1400_1600)

శ్రీ నాథుడు (వల్లభభ్యుదయము)

శ్రీనాథుడు వల్లభాభ్యుదయము అను కృతిని రచించినట్లే గ్రంథమూలము ననే లోకమునకు తెలిసినది (ప. 481). దీనిని గూర్చి ప్రభాకర`శాస్త్రి గారు పీఠిక లో చర్చించియున్నారు. (పుట. 25-26)

శ్రీనాథ కృతులనుండి యీ క్రింది పద్యము లిందుగలవు.

269. భావన పెమ్మన అనిరుద్ధ చరిత్ర
వేలుపు గియుం బరుసచేది ........ ........ భీమేశ్వర పురాణము 2-14
272. విష్ణుకథానిధానము.............. ........... " ........ 4 -149
శా ఆడెందాండవమార్బటి
547. క్షయకాలంబున ......... ............. కాశీఖండము 5-89

తాళ్లపాక అన్నమయ్య

అన్నమయ్య వేంకటేశ్వర శతకమునుండి యొక పద్యము(7)దాహ రింపబడినది. ఈ శతకమునుగూర్చి కీ. శే. వంగూరు సుబ్బారావుగారు శతక కవుల చరిత్ర (1924) లో వ్రాసిరి. 1953 లో వావిళ్లవారు నా పీఠికతో గూడ దీనిని ముద్రించిరి.

జై తరాజు ముమ్మయ్య

ఈతని విష్ణుకథానిధానము నుండి 42 పద్యము లు (884-406) దాహ రింపబడినవి. ఇందు ఆఱు పద్యము లీతనివిగావు. కావున యిందున్న పద్య ములు-36. ఇది ప్రశ స్తకావ్యము కావుననే యిన్ని పద్యములుదాహరింపబడినవి. ముమ్మకవి శ్రీనాథుని సమకాలికుడు. శ్రీనాథుడు ప్రౌఢ దేవరాయని ఆస్థానమునకు వెడలినప్పుడు తొలుత ఆస్థానమున నున్న ముమ్మకవిని దర్శించి యిట్లు చెప్పినాడు.