పుట:Prabandha-Ratnaavali.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50


పోతనకు ముందే శంభుదాసుడగు ఎఱ్ఱన రామాయణ హరివంశ ములను వైష్ణవ సంబంధ గ్రంథములు రచించెను.

నాచన సోమన

సోముని యుత్తరహరివంశమునుండి ఒక పద్యమిందుదాహృతమైనది-

386 జయనారాయణ పుండరీక నయనా శార్జీ జగన్నాయకా
జయపీతాంబర భక్తవత్సల విరించ స్తోత్రపాత్రక్రియా
జయ జంభారి విరోధి విక్రమకళాఖాఘా విఘాత క్రియా
జయ గోవింద ముకుంద మంధరగరాశారీ మురారీ హరీ

-

ఇది జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానములోనివిగా నున్నది. కాని ఉత్తర హరివంశమున (8-2) నిది గలదు--


చిమ్మపూడి అమరేశ్వరుడు

ఈతని కృతియగు విక్రమ సేనమునుండి (10-83)58 పద్యము లుదాహరింపబడినవి. ఈ సంకలన గ్రంథమున- పెమ్మన అని పెద్దచరిత్రనుండి 63 పద్యములు గ్రహింపబడినవి కనుక పద్యగ్రహణమున నిది రెండవది. అమరేశ్వరుడను కవియున్నట్లు లక్షణ గ్రంథమూలమున మనకు తెలిసినను, అతని పూర్వకవులు చాలగా ప్రశంసించినను, ఆతని కవితా వైశిష్ట్యమును తొలత లోకమున కెఱుక పఱచినది ప్రభాకర శాస్త్రి గారే- ప్రబంధ రత్నావళిలో సుదాహ రింపబడిన 53 పద్యములలో నాలుగుపద్యము లమరేశ్వరునికావు. కాబట్టి యందు నవి 48 పద్యములని మనము గ్రహింపవలెను.

క్రీ. శ. 1856 సంవత్సరముననున్న అప్పకవి సమకాలికుడగు అహో బలపతి తన అహా బలపండి తీయమున అమరేశ్వరుని విక్రమ సేనమునుండి యొక పద్యపాద ముదాహరించినాడు.

అజంతపరిచ్ఛేదము - “అర్థవిశేషము.. సమహత్తులకు మహనాకారము వచ్చును" అను ఆథర్వణకారిక నుదాహరించుచు-

“మాకెల్లఁ గలహరింబుకూడ డిక నీ మర్యాద జెల్లింపవే ”