పుట:Prabandha-Ratnaavali.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43


మున అని ప్లుతయతికి నుదాహరణముగా నీయబడినది. దీనినే కస్తూరిరంగకవి ఆనందరంగరాట్ఛందస్సున గ్రహించినాడు (8–189)

ఇందువలన విజయ సేనమునందలి పద్యములు 18 ను- ఒక సీసపద్యమున రెండు పాదములును లభించినవని గ్రహింపవలెను.

విజయ సేనము - తిక్కన కృతిగా పెదపాటి జగ్గన ప్రబంధ రత్నాకర యుదాహరించినాడు

ప్రబంధరత్నావళి చివర -

పెదపాటి జగన్నాథకవి మా త్రమే యుదాహరించిన కవులు కావ్యములు

ఆంధ్ర సాహిత్యపరిషద్గ్రంథ సంధాత మాత్రమే యుదాహరించిన కవులు కావ్యములు.

ఇర్వురు సుదాహరించిన కవులు కావ్యములు అను మూడ శీర్షికలలో కవి కావ్య వివరము లీయబడినవి.

ఇందు మూడవ శీర్షికలో -

“ి తిక్కన-విజయ సేనసు 168- ! 57. ఆం. 152, 154, 155-160" అని స్పష్టముగా దెలుపబడినది. కావున క్రీ.శ. 1580 నాటికది తిక్కనకృతియే యని సంకల నగ్రంథకర్తలు నిశ్చయించినట్లు తెలియగలదు.

(పుట 188)

విజయ సేనమునందలి -

“తరుణుల వీరుడన్నుగవ తాకున" అను ప్రబంధ రత్నావళిలోని పద్యము-- తిక్కన నిర్వచనోత్తర రామాయణము 1-51 లో నున్నది.

తిక్కన తన గ్రంథములలో నొక కృతిలోనివి మఱియొక కృతిలో గ్రహించు సంప్రదాయము గలవాడు. నిర్వచనోత్తర రామాయణ పద్యములను భారతమున గ్రహించినాడు, అట్లే తన విజయ సేనమునందలి పద్యమును నిర్వచనోత్తర రామాయణమున గ్రహించినాడు. ఇందువలన -

“ఈ లాక్షణిక గ్రంథ ప్రామాణ్యము ననుసరించి విజయ సేనమును తిక్కనగారే వ్రాసినారనుట కవకాశము కనిపించుటలేదు" అను వాక్యము