పుట:Prabandha-Ratnaavali.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41


రంగనాథుఁడు (407 - 409)

ఈతని పద్యములు మూడుదాహరింపబడినవి.ఈతడు పాల్కురికి సోమనాథుని సమకాలికుడైన చక్రపాణి రంగనాథుడు - ఈతనిగూర్చి తొలుత తెలిపినవారు ప్రభాకరశాస్త్రి గారే. (చూడుడు బసవపురాణము ప్రథమముద్ర ఇము (1926), పీఠిక పుటలు 28-28.)

ఈతడు శ్రీగిరినాథ విక్రమము అను 700 సీసపద్యములుగల గ్రంథము రచించెను. ఈతని చరిత్రము కన్నడ కవిచరిత్ర లో గలదు. అందాతడు పెక్కు శతకములను దండకములను తోటక వృత్తములను, రగడలను రచించినట్లు గలదు, ఇందు దుదాహరింపబడిన పద్యము-

బ్రకటించిరి.

“గిరిజాధినాయకా" అను

మకంటముగలది. ఆ పేరుగల శతకము లోనిది కావచ్చును-ఇట్లే ఈతని చంద్రోధరణశతకమునుండి యొక పద్యము లాక్షణికు లుదాహరించిరి. రగడలను రెండింటిని--నయన రగడ-సమశ్శివాయ రగడ అను వానిని శాస్త్రిగారే గుర్తించిరి. ఆ రెండింటిని వారు “రంగనాథుని శివకవిత్వము" అను వ్యాసమున అది శ్రీ వేంక టేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థపత్రిక యందు ప్రకటితమైనది. (1961)

తిక్కన -ఎఱ్ఱన యుగము (1250–1400)

తిక్కన

తిక్కన విజయ సేనమునుండి యిందు పద్యము లుదాహరింపబడినవి.(151 - 180)

161వ పద్యము "ఉత్సాహప్రభుమంత్రశక్తులు"అనునది- నీతి భూషణము లోని పద్యము-సకలనీతి సమ్మతము (150 పద్యము)

సీ. ఆరిమానసంబులు
ఉ. అల్లనఁ దొండ మెత్తి
క. కిసలయకదళీ
చ. కొనియెద మన్న