39
ఉ. శాలివనాలి తెలి జలజాతపరాగము దూలి పద్మిని
కూలలతాంత సౌరభము గ్రోలి మధూలిత పక్షజాతవా
తూలము నేలివాకణము దోలి మదేభమదాంబుధారలన్
దేలి వనాంతరాళములఁ ద్రిమ్మరు గాలి ప్రమోదశాలియై.
ఇది సర్వదేవుని యాదిపురాణమునందలి దని లక్షణసారమను నొక లక్షణ గ్రంథమున నున్నది
ఆప్పక వినాటికి ఆదిపురాణమున్నట్లు తెలియుచున్నది. ఆదిపురాణ మని యిచ్చిన పద్యము ఉత్తర హరివంశములో నున్నది కాని - ఆ కాలమునకు తెలుగున ఆదిపురాణ మున్నట్లుగా అది తెలుపుచున్నది.
(తెలుగు కవుల చరిత్ర పుటలు 91-96)
శివకవి యుగము (1100-1250) నన్నెచోడకవి
నన్నెచోడకవికృత్యంతరమగు కళావిలాసము నుండి యిందు 4 పద్య ము లుదాహరింపబడినవి. ఈ గ్రంధ్రమునకు ముందుగా కళావిలాసమును గూర్చి తొలుత మానవల్లి వారే తెలిపిరి-1908 లో కుమారసంభవ ప్రథమభాగమున- నాల్గు పద్యము లిచ్చిరి.
.....................................................................ప్రబంధరత్నావళి
క. తలపోయఁగ రుచులాఱును .....................184 పద్యము
చ. తొడవులు పెట్టుసంభ్రమముతో ..................185ప.
సీ. పృథుల విశ్వంథరారథము ....................186 ప.
క, శ్రీమంతుఁడు గుణవంతుఁడు...................... 187 ప
ప్రబంధరత్నావళిలో 187 పద్యముగా నున్న 'శ్రీమంతుఁడు' అన్న పద్యము కవిగారీయలేదు. దానికి బదులుగా
చ, లలనలు కొందరాత్మ పతులం దగగూడిన చెయ్వులన్నియున్
దలఁచి సభీజనంబులకు దప్పక చెప్పెడివారు పుణ్యజీ
పులు చెలి యామినీళుని కవుంగీల డాయుటెగాక తాల్మికీ
ల్దొలఁగిన తీరుగేరునట దోపవు నాకు రతి ప్రయోగముల్ ,