పుట:Prabandha-Ratnaavali.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38


ఆదిపురాణమనగా జైనతీర్థంకరులలో తొలివాడైన ఋషభదేవతీర్థంకరుని చరిత్రము- దీనిని కన్నడ భాషలో పంపమహాకవి వ్రాయగా తెలుగున పొన్నకవి వ్రాసినాడు.

పొన్నకవి ఆదిపురాణము మన కీనాడు లభ్యముకాకపోయెను. తిక్కన కాలమునాటి కుండినట్లుగా మనకీ క్రింది పద్యములను బట్టి తెలియుచున్నది.

క. ఆరదములు దీవులున్నత కరులు గిరులు హరులు వీచికలు సుభటసము త్కర ముగ్ర సత్త్వములుగా శరనిధీగతి పాండుపుత్ర సైన్యం బొప్పెన్, (భీష్మ 1-181)

ఆదిపురాణము - కన్నడము

క. తరళ తరంగ తురంగం కరిమకరక రీంద్రమాఖిలశ ఫరతదాత్యు త్కరముగ్రహరథం భరతం గిత్తురుపయోధి బళ విళ సవమం.

ఆదిపురాణము తెలుగునను నిదే ప్రాస యుండనోపును తిక్కన పద్య మున - "ర" ప్రాసయే యుండుట గమనించదగినది.

తిక్కన - కరికరళీకరతురగో
                           త్కరలాలాజాలరక్తధారాపటలీ
                           పరిషి కంబై సంగర
                           ధరణీరజ మడఁగె నద్భుతం బెలరారన్ - (భీష్మ 1-245)

కన్నడము - కరికరశీకరమదజల
                 తురంగలాలాంబు సేక దిందఱదుఱది
                 ర్దరజం నరేంద్రచామర
                మరుదభిహతియందెరళ్దు తూళ్లత్తాగళ్

పైవానినిబట్టి తిక్కనాటికి సర్వదేవుని ఆదిపురాణము వ్యాప్తిలో నున్నది.