పుట:Prabandha-Ratnaavali.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. పదియుఁ బదియు నింకఁ బదియేను బదియేను
నిరువదేను నూటయిరువదేను
నూఱు నూఱు నూఱు నున్నూఱు నన్నూఱు
తలలవాఁడు నిన్ను ధన్యుఁ జేయు. (జ) 581

చ. పరమవివేకసాగరుఁడు పంకజసంభవసంభవుండు ధూ
మరహితవహ్నితుల్యుఁ డసమానతపోనిధి విష్ణుభక్తిత
త్పరుఁ డఘదూరుఁ డాద్యుఁడు కృపారసచిత్తుఁడు దివ్యబోధ సు
స్థిరుఁడగు నవ్వసిష్ఠుఁ డరుదెంచె దిలీపనృపాలు పాలికిన్. (ఆం) 582

చ. పలుకులయాస వాయపునెపంబిడి పల్కు సఖీజనంబుతోఁ
బలికినమాత్రఁ జూడ్కులకు బ్రాంతిగ వెన్నెలఁ బుక్కిలించి న
ట్లలువుల వెళ్ళు గాంత దశనాంశువిభాతికి వజ్రదాడిమీ
ఫలనవబీజమౌక్తికవిభాతికి రాజనుమాట పూజయే? (ఆం) 583

సీ. పలుకుల వెడలజ్జ వెలితి సేయుచు నొయ్యఁ బలికించి చూడ్కికిఁ బట్టు కొలిపి,
చెంతకు నెఱయని చెయ్వులఁ బుయిలోట సడలించి వేడ్కలఁ గడకుఁ దెచ్చి,
నెపమునఁ జోఁకి పొణ్మెడుకంపములు మాన్చి డాసి వంచించి పొందాస పఱచి,
యుపగూహనములకు నొఱపిచ్చి పురికొల్పి చుంబనములఁ జవి చూపి రేచి,
గీ. మూరి బోయిన మవ్వంపుఁ గూరి మెసఁగఁ
గాయ్వు దలకంటెఁ జెయ్వుల గడవఁగఱప
బల నవసంగమంబున నోలలార్చె
రాజనందనుఁ డా రతిరాజు పోలె. (ఆం) 584

సీ. పసిఁడిక్రొమ్ముగులులోఁ బ్రభవించి యచలిత శ్రీ మించు చంచలరేఖయైన,
వరసుధారససరోవరములో జనియించి యనిశంబు నలరెడు వనజమైన
నిక్షురసాబ్ధిలో నెలసి మార్దవమున నతిశయిల్లు ప్రవాళలతికయైనఁ
బరిపూర్ణచంద్రబింబంబను కరసాన నొరసిన నురువాఁడిశరములైన,
గీ. బోల్ప నొకకొంత పొసఁగినఁ బొసఁగుఁగాక
ముదిత నెమ్మెనిమెఱుఁగును మోముచెలువు
నధరమును గటాక్షముల సోయగమునందు
దొరయు నన నెందు నొంఢువస్తువులు గలవె? (ఆం) 585