పుట:Prabandha-Ratnaavali.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దలక భరంబు పూని గనయం బొకచే నమరన్ రతాంత వే
ళల శయనంబు దిగ్గుసతులన్ వనజాక్షుండుఁ పొందె వెండియున్. (ఆం) 562

సీ. కలకంఠమదకీరకలకలధ్వనులతో బెడఁగుగా నెలవీరు విడిసె మరుఁడు,
మరుధనుర్జ్యావల్లి మొరపంబుగతి లతామంటపంబుల నించె మధురరవము,
మధుపరవోల్లసన్మంజరీమకరంద సురభిగంధంబులు నెరసె దిశల,
దిశలెల్లఁదానయై తిరిగె బంధుశ్రేణి కంపింప దక్షిణగంధవహుఁడు,
గీ. వనములెల్లను గ్రొత్తజవ్వనముఁ దాల్చె
దళితహేమంతగర్వమై వెలసె నెండ
సతుల హిందోళగానంబు లతిశయిల్లె
రాగకరమైన నవవసంతాగమమున. (ఆం) 563

గీ. “కాంత! నీ మోముఁబోలమిఁ గందె నిందుఁ
డీసువాఁడని కినియకు మింక” ననుచు
బ్రార్థనము సేయుచున్ మ్రొక్కునట్టి యుడుగ
ణంబొకో నాఁగ సతిపాద నఖము లమరు. (ఆం) 564

చ. కుసుమశరాళి బాసటము గొల్పిన కైవడిఁ దమ్మి ఱేకులం
గసిబిసి సేసి క్రాలు తెలిగన్నులఁ గజ్జల మిడ్డ బ్రహ్మ న
ల్వెఁగఁగ గండుమీల సృజియించుతఱిన్ ఋజులేఖ క్రొత్త య
భ్యసనపు నీలినూ ల్మడఁచినట్లు మృగాక్షికి నొప్పు నెంతయున్. (ఆం) 565

సీ. కొండంత హేమకోదండంబు విలసదహీనగుణంబున నెక్కు వెట్టి,
హరినీలమణి కాంతియగు నమ్ము శరధిపొం దెడలించి వలచేత నేర్చిపట్టి,
స్వరముల సకిలించు వారువంబుల గుణాధారభూతంబగు తేరఁబూన్చి,
నలుదిక్కులును జూడ్కు లొలయంగ సకలంబుఁ గను వాని సారథిగా నొనర్చి,
గీ. కడఁగి రథచక్రములు తన కన్నులట్ల
యేమఱక యేఁగఁద్రిపురంబులేర్చి సకల
లోకములు నెమ్మిఁ బ్రోచు పినాకపాణి
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత! (ఆం) 566

మ. క్షయకాలంబున సీధుసాగరరసాస్వాదాతిరేకంబునన్
నయనాబ్జంబులు ఘూర్ణితంబులుగ సంధ్యాకాళరాత్రీకర