పుట:Prabandha-Ratnaavali.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. దొరలు రాజులందు నరయుచు భటులందు
భేద మొదవకుండ నాదరించి
యుచితవృత్తిఁ గావకుండిన దుర్గంబు
నేలఁగలఁడె భూమి నింద్రుఁడైన? (?) 528

? [పంచతంత్రము] (జ)
గీ. అన్యదేశమెల్ల నాత్మదేశంబ కాఁ
దలఁచువాఁడు నెపుడు తలఁకు లేక
రణము సేఁత యెల్ల రాజ్యంబుసేతగాఁ
దలఁచువాఁడు ప్రియుఁడు ధరణిపునకు. (జ) 529

చ. చెలువుగ దుష్కరంపుఁబని సేసియుఁ జేసితినాక, క్రూరతం
బలుమఱు వ్రేసినం గడవఁ బల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక, పల్కు చొప్పిదము తథ్యముగాఁ దగఁబల్కి మోసలన్
బిలువక వచ్చియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్ని భంగులన్. (జ) 530

క. బలుకొఱడువోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్. (జ) 531

క. మానుగఁ బతి వనిచినఁ దన
చే నది గాదనక వేగ సేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిని భృత్యుల్. (జ) 532

? [పురాతనచరిత్రము] (ఆం)
క. చీటికి మాటికి వెలువడి
హాటకమయ వప్రమెక్కి యహికన్యలు మి
న్నేట విహరింతురనినను
గోటపొడువుఁ బరిఖలోఁతుఁ గొలఁదియె పొగడన్. (ఆం) 533