పుట:Prabandha-Ratnaavali.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 ప్రబంధరత్నావళి

విన్నపము చేసె నిట్లని వేడ్క దనదు
డెందమునఁ గందళింపఁ బుళిందవిభుఁడు. (జ) 345-A

మ. కటకండూయన మంతనంతఁ జలుపంగాఁ దామ్రపర్ణీ మదో
త్కటదానంబులు నిండి చెండుకొన కస్తగ్రావకూటద్యష
త్తటముల్ మెట్టఁగఁ జిర్కుబాఱె నవినీతంబుల్ వడింబాఱెనా
బుటకన్యాప్తుఁడు గ్రుంకెఁ బశ్చిమ మహాంభోరాశి పూరంబునన్. (జ) 345-B

చ. నిలయతమఃప్రతానము గణింప మఱుంగులు సొచ్చినట్టుగా
నలరు పిఱిందినీడలు రతాంతదుకూలపరిగ్రహ త్వరా
కలిత విలాసినీ నివహకౌతుక హేతువులై చెలంగ ను
జ్జ్వలరుచి మించె గేహముల సంపెఁగమొగ్గలవంటి దీపముల్. (జ) 346

మల్లుభట్లు, ఘటసాసి [జలపాలిమహత్త్వము] (జ)
సీ. అత్రిమునీశ్వరుం డడవి కేఁగిన వేళ హరిహరబ్రహ్మలు ధరకు వచ్చి,
యనసూయ వర్తనం బరయఁ దలంచి వా రతిథులై యాహార మడిగినంత,
యవుగాక యని వేగ నన్నపానాదులు వడ్డింపఁ దలఁచుచో వారికోర్కి,
తప్పకుండఁ బతివ్రతాప్రభావంబున నకళంక యగుచు బాలకులఁ జేసి,
తే. యంబరము లూడ్చి, సకలపదార్థములను
పాత్రములఁ బెట్టి, తొంటి [రూప]ము లొనర్ప
సంతతం బంది, తత్తదంశముల సుతుల
వరము లందె, నయ్యది పతివ్రతల మహిమ. (జ) 347

సీ. కచభరకృష్ణమేఘంబులఁ బ్రభవించు మెఱుంగుఁదీగలరీతి మేను లలర
వదనేందుదరహాసవరశరచ్చంద్రిక లక్షిచకోరంబు లనుభవింప
నతులసౌందర్యాబ్ధి కధరబింబద్యుతుల్ పవడంపుఁదీగెల బాగు మెఱయ
జగముఁ గెల్వఁగ దక్షనగరంబు దొనసేసి మరుఁడు దాఁచిన దివ్యశరము లనఁగ
తే. సరసలీలావలోకనచతురగతుల
నప్సరస్త్రీసమూహంబు లభ్యసింపఁ
బద్మినీజాతిముఖ్యస్వభావములను
వన్నె మెఱయదు రప్పురివారసతులు. (జ) 348