పుట:Prabandha-Ratnaavali.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56 ప్రబంధరత్నావళి

సీ. మకరందరసపానమత్తాలినీగానమంజులోద్యాననికుంజములను,
కలనినాదగభీరకాదంబసంచారసముదీర్ణకాసారసైకతములఁ
జందనామృతచంద్రచంద్రశేఖరచంద్రసదృశశోభాసాంద్రసౌధములను,
కమలాప్తహిమభానుకాంతశిలాభానుమహితలీలాసానుమంతనములను,
గీ. వినుతలావణ్యసంపద కనుగుణంబు
ప్రకటసామ్రాజ్యవిభవంబునకు ఫలంబు
నగు మనోజఖేలనమున నతిశయిల్లె
భోజనందనయును దానుఁ బుష్పశరుఁడు. (ఆం) 259

సీ. మత్తాలిసంగీతమాధుర్యములతోడి కుసుమగుచ్ఛంబులు కోసి కోసి
సంఫుల్లమాధవీసదనవాటికలందుఁ జిలుకల పెండిండ్లు చేసి చేసి
కమనీయకమలినీఘనసైకతంబుల నంచలఁ బట్టంగఁ బొంచి పొంచి
సహకారవరుతరుచ్ఛాయాతలంబుల మేనులఁ జెమరార మెలఁగి మెలఁగి
గీ. దర్పకునియాజ్ఞఁ దలమోచి తమక తమక
తమకముల నోలముల కల్లఁ దారి తారి
మఱియు బహువిధసంచారమహిమ లమర
నుల్లసిల్లిరి లీలామహోత్సవముల. (ఆం) 260

గీ. మందవాఃకణపరితాపమథితహృదయ
పాంథలోకమై తన విజృంభణము దనర
శిశిరసంపద భువనలక్ష్మీ దుకూల
కల్పితోపకుంఠనభాతిఁ గానఁబడియె. (ఆం) 261

క. మధుపర్కము సేయించిరి
మధురిపు మనుమనికి సర్వమంగళ యెదురన్
విధివిహతంబగు పథమున
నధిగతపరమార్థులగు సురాసురమంత్రుల్. (ఆం) 262

చ. మరుతురగాలయంబులన మన్మథు నమ్ములయిండ్లు నాఁగ శం
బరరిపునాట్యశాలలనఁ బంచశిరీముఖు నాతపత్రమం
దిరములు నాఁగఁ శారుశుకదీప్తలతాంతమరుచ్ఛటల్ లతా
సురుచిరపల్లవ ప్రతతి సొంపెసగుం బురితోఁట లెప్పుడున్ (ఆం) 263