పుట:Prabandha-Ratnaavali.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 47

సీ. వలరాజు వోసిన విలునాఱువోలె బం ధురములగు చెఱకుఁదోఁటలకును,
నలువచేఁ బెరిఁగి దీనుల కీగియును లేని కల్పకంబులు వోని క్రముకములును,
మాధవుండేదిన మవ్వపుఁబొరల యే డ్తెఱ నివ్వటిలు నాకుఁ దీఁగెలకును,
పర్జన్యసత్కృతిఁ బసిఁడి పండెడు చేల నంగఁ బేర్చిన రాజనంబులకును,
తే. దెట్టుపలు గట్టి నీటితోఁ దేలిపాఱు
తమ్మిపుప్పొళ్ళఁ బ్రోదులై తనరుచుండు
ననిన నవ్వీటిచెఱువుల యతిశయంబుఁ
బుడమిలో నింక నేమని పొగడవచ్చు? (జ) 213

ఉ. శీలములీల, లంగములు చేకొని క్రాలెడు వేదముల్, కలా
జాలము మన్కిపట్లు, యతిసజ్జనసంపదతిట్ట, లర్థి పూ
జాలలిత ప్రభావములు ... .... .....
వేలుపుఁ బిండుపండువులు, వీట ధరామరు లుత్తమస్థితిన్. (జ) 214

పెమ్మన, భావన [అనిరుద్ధచరిత్రము]

గీ. అన్నిదినములు నీ భంగి నఖిలలోక
సమ్మదావహమై మహోత్సవము జరుగ
నుత్తమ క్షత్రవిహిత శాస్త్రోక్తసరణి
శాంతవిఘ్నమై పెండిలి సంపతిల్లె. (ఆం) 215

గీ. అభినవములైన ముక్తాఫలాక్షతములు
హస్తపంకేరుహముల నిండారఁబట్టి
జాణజగజెట్టియగు పంచబాణుపట్టి
చేరి నించె నుషాదేవి శిరముమీఁద. (ఆం) 216

క. అభిషేకోత్సవ లీలా
విభవానంతరమునందు వెన్నుని మనుమం
ఢభినవవిలేపనాంబర
విభూషణ స్రక్కలాప విభ్రాజితుఁడై. (ఆం) 217

సీ. అర్జునప్రీతియు నర్జునఖ్యాతియు నిగిడింప మగిడింప నేర్పుగలిగి,
యక్రూరచరితంబు నక్రూరదురితంబు భూషింప దూషింపఁ బొందెఱింగి,