పుట:Parama yaugi vilaasamu (1928).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

51


విసుమాన మంది యవ్వేళ దేవేంద్రుఁ
డసమానభీతిచే నందంద వడఁకి
పూని యీక్రూరత పో వృత్తి నెట్టి
మానవుండ వని నమానవేశ్వరతఁ
గోరి డెందమునఁ గైకొనియెనో కాని
యేరీతి నుండునో యిది యంచుఁ దలఁచి
సంచితమన్యుఁ డై శతమన్యుఁ డపుడు
పంచాస్త్రుమోహనబాణంబుకరణిఁ
గనుపట్టు నచ్చరఁ గాంచనవర్ణి
యనుపేరిచెలువ నొయ్యనఁ జేరఁ బిలిచి
ధరలోన భార్గవతాపసుం డిప్పు
డురుఘోరతపము సేయుచునున్నవాఁడు
చపలాక్షి! నీవిలాసముచొక్కుఁ జల్లి
తపసి గూర్చినతపోధనముఁ గైకొనుము
మదవతి! నినుఁ గన్నమానవుఁ డింద్ర
పద మేలఁ దలఁచు నెప్పగిదినంటేని
రమణి! నీయరుణాధరముఁ గ్రోలువాని
కమృతంబు మై నేల యాసలుపుట్టుఁ
గాంత! నీకుచములుఁ గనువాని కమర
దంతికుంభములపైఁ దలఁ పేల కలుగు