ఈ పుట ఆమోదించబడ్డది
అష్టమాశ్వాసము.
639
సరగున నిజశిష్యసహితుఁడై రంగ
పురమున కరిగి యాపోయివచ్చుటయు
వడిమీఱ నొకశిష్యవరు లక్ష్మణార్యు
కడకుఁ బంపుటయు శీఘ్రమె యేగి యతఁడు
వినుపింప నెంతయు విన్ననై వగచి
కనలి శ్రీవేంకటగ్రావేశుఁ దలఁచి
జగతీశ చోళపాషండి నిర్మూల
మగుఁ గాక యని యొక యర్ఘ్య మిచ్చుటయు
వెలయుప్రహ్లాద విద్వేషిపైఁ గనలు
నలనరసింహునియనువున నింగి
శ్రీవేంకటేశుండు శితఖడ్గధార
నావేళ కలలోన నరుదెంచి వాని
గళనాళ పార్శ్వంబు ఖండింప నందు
విలవిల మనుచుఁ బర్వినకంపుతోడ
బెడిదంపుఁబురువులు భేదించి పుచ్చి
వెడలంగఁ జోళుండు విడిచెఁ బ్రాణమ్ము
లదిమొదల్ క్రిమికంఠుఁ డనుపేర వాఁడు
విదితుఁడై యుండెఁ దద్వృత్తాంత మెల్ల
రామానుజార్యుఁ డారసి సంతసించి
యామోదవార్ధి నోలాడి యామీఁద