ఈ పుట ఆమోదించబడ్డది
638
పరమయోగివిలాసము.
నావేళ శ్రీలక్ష్మణాచార్యవర్యుఁ
డావచ్చు టెఱిఁగి సయ్యనఁ జెంతనున్న
యిసుము గైకొని వేంకటేశ్వరుమీఁద
నసమానగతిఁ దొల్లి హరిచిత్తయోగి
యెసఁగించు నొకపద్య మెన్ని లోలోనె
మసలక యట నభిమంత్రించి వైవ
నది రాజభటులకు నడ్డమై పొదలి
కదలక పర్వతాకారమై యుండె
నాకొండవలె నున్న యది చూచి భటుల
మూఁక రానోడుచు మొనచెడి యరిగి
నాదట వేగ రామానుజమౌని
యాదవాచలమున కరిగె నంతటను
నడుగక కపటసన్యాసియై తనదు
కడకు వచ్చుట యని కడుఁ గోపగించి
తివిరి చోళుఁడు కూరతిలకునేత్రములు
తివియుండ యని పల్క ధీరుఁడై యాతఁ
డనియె విష్ణుద్రోహి వగునిన్ను నిపుడు
గనుఁగొన్న యిటువంటికన్ను లేమిటికి
నని తమగోళ్ళతో నపుడు రాఁ దిగిచి
కొనుచు నచ్చో నెలకొనియుండలేక