పుట:Parama yaugi vilaasamu (1928).pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

637


జనుదేర చోళరాజన్యునిభటులు
గనుఁగొని యితఁడె లక్ష్ముణమౌని యనుచుఁ
గొనిపోయి యప్పు డాక్రూరునియెదుట
నునుప నాపాపాత్ముఁ డుగ్రతం బిలిచి
పనుపడఁగా "శివాత్పరతరంనాస్తి”
యనుచు వ్రా లిడు మని యాకు గంటంబు
చేకొని తాన యిచ్చిన జంకు లేక
కైకొని వైష్ణవకల్పభూజంబు
తగఁ "ద్రోణమస్తితతః పరం” బనుచు
బెగడ కందున వ్రాలు వెట్టెఁ బెట్టుటయు
నవి చూచి యుగ్రుఁడై యాజ్ఞయు సేయఁ
దివిరిన యాధరాధిపుఁ జూచి హితులు
ఇతఁడు రామానుజుఁడే కాఁ డటన్న
నతనిఁ దో తెండని యనిచిన భటులు
పరువడి శ్రీరంగపట్టణంబునకు
నరిగెడిసమయంబునందు ముందుగను
సరవిగా వెల్లలజాతిగృహస్థు
కరణి వేవేగ లక్ష్ముణదేశికుండు
పురము వెల్వడిపోవ భోరన భూమి
వరభటవర్గంబు వడి మీఱి కదియ