పుట:Parama yaugi vilaasamu (1928).pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

629


దైవాఱుపుడమిపైదలిమోముదమ్మి
తావులు గ్రోలెడుధరణీవరాహు
సేవించి యటఁ బ్రదక్షిణముగా వచ్చి
యావరణంబుల కాదియై మిగుల
గొమరారువైకుంఠగోపురంబునకుఁ
బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంతఁ
జనుదెంచి గారుడస్తంభంబుచక్కి
వినతుఁడై చెంత క్రొవ్విరిసాల కేగి
వలనొప్పుచంపకావరణంబు వేగ
వలచుట్టి వచ్చి యాస్వామిపుష్కరిణి
తోయంబు [1] లోని యుత్తుంగభాగమున
నాయహికులపతియవతార మగుచుఁ
దిరుగనిచింతలుం దెరలించునీడ
దిరుగనిచింత కెంతే భక్తి మ్రొక్కి
రమణ రెండవగోపురము దాఁటి లోని
కమలమహానసాగార సేవించి
నెలకొని యానందనిలయాఖ్య మగుచు
నలువొందు మణివిమానంబు సేవించి
పటుమహామణిమంటపంబు సేవించి
యట వచ్చి తురగతార్క్ష్యాహినాయకుల


  1. లాని