పుట:Parama yaugi vilaasamu (1928).pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

627


నెదురుగాఁ జనిన మౌనీంద్రుఁ డావేళఁ
ద్రిదశవందితుఁ డైన తిరుమలనంబిఁ
గని భక్తిఁ బాదపంకజముల వ్రాలి
తనరారఁ దత్ప్రసాదము స్వీకరించి
యారయ సర్వలోకాచార్యు లైన
మీ రీప్రసాద మిమ్మెయి దేరవలెనె
పనిఁ బూని యొకపిన్నపాపనిచేత
ననిపినం జాలదే యనిన నాఘనుఁడు
నిప్పుడు మీ రానతిచ్చినకరణి
తప్పక నగర మెంతయు వెదకితిని
ఆకడ వైష్ణవు లగువారిలోన
నాకన్న నెన్న చిన్నలు లేరు గానఁ
దెచ్చితినన్న నాదేశికుమాట
మచ్చిక వేదాంతమార్గమై యున్న
ననయంబు మోదించి యామౌనివరుఁడు
తనశిష్యవరుల నందఱ విలోకించి
కంటిరే యిపుడు వేంకటపూర్ణుమహిమ
గెంటక మది నహంకృతిలేశమైన
నరయక పెద్దవా రైన నైచ్యంబు
దొరయంగ భాగవతులయెడాటమున